Thursday, December 16, 2010

నాలుగు బొమ్మల కధ

కుటుంబరావు, అనసూయ దంపతులకు ప్రియ లేక లేక కలిగిన సంతానం. వివాహం అయిన పది సంవత్సరాల తర్వాత పుట్టినందున ఆ అమ్మాయిని వారు ఎంతో ప్రేమగా పెంచుకోసాగారు. తాను ఆడిందే ఆట, పాడిందే పాటగా పెరిగింది. బజార్లో ఏ వస్తువునైనా చూసి కావాలని పేచీ పెడితే క్షణాలలో ఆ వస్తువు ఆమె ఒడిలో వుండాల్సిందే ! ఇంటిలో పని చేసే నౌకర్లందరూ కూడా ప్రియ అంతే ఎంతో అభిమానంగా వుండే వారు.

అష్టైశ్వర్యాలలో పుట్టి పెరుగుతున్నా ఆ అమ్మాయిలో గర్వం అనేది కించిత్ కూదా కనిపించేది కాదు. అందరితో ప్రేమగా, స్నేహంగా మెలుగుతుండేది. స్నేహితులు తన వస్తువులను అడిగితే కాదనకుండా ఇచ్చేసేది.ఆమే స్నేహానికి కులం, మతం, పేదా గొప్పా అన్న పట్టింపులు అసలు లేవు.అందరితో కల్మషం లేకుండా మెలుగుతూ,స్నేహం చేస్తూ ప్రియ మంచి అమ్మాయి అన్న పేరు తెచ్చుకుంది.ప్రియలో అన్నీ మంచి గుణాలే వున్నా ఈ ఒక్క లక్ష్నమే కుటుంబరావు దంపతులకు నచ్చేది కాదు. ప్రేమించడానికి, స్నేహాలకు,త్యాగానికి ఒక హద్దు అంటూ వుండాలన్నదే వారి ధృఢ విశ్వాసం.ప్రియ హద్దులనేవి లేకుండా ఎలాంటి వారితోనైనా ఎంత సేపైనా భేజషాలు లేక మట్లాడడం, అడిగిన వారికి లేదనకుండా, ఆసలు ఆలోచించకుండా ఇచ్చెయ్యడం భవిష్యత్తులో ఎటువంటి దుష్పరిణామాలకు దారి తీస్తుందో నని వారు అనుక్షణం భయపడుతుండేవారు.

వయసుతో పాటు ప్రియలోని స్నేహ, దాన గుణాలు కూడా పెరుగుతూ వచ్చాయి.అయితే ఇది కొన్ని సార్లు చెడు ఫలితాలను ఇచ్చేది. అమాయకురాలైన ప్రియకు మంచికి, చెడుకూ మధ్య తేడా ను గుర్తించగలిగేది కాదు. ఏవరు ఏది అడిగితే అది కాదనకుండా ఇచ్చేసేది.లేదు, కాదు అన్న పదాలు ఆమె డిక్షనరీలోనే లేవు. ఏదైనా ఇచ్చే ముందు ఫలనా వస్తువును ఫలనా వారికి ఇవ్వవచ్చునా లేదా అన్న ఆలోచన అసలు చేసేది కాదు.ఎదుట వారిలోని మాయ, కల్మషం, కుట్ర ఇత్యాది స్వభావాలను కనిపెట్టలేకపోయేది. ఫలితంగా ఎందరో ఆమె అమాయకత్వాన్ని పలు విధాలుగా కాష్ చేసుకుంటుండే వారు. కొన్ని సంధర్భాలలో షాప్ కీపర్లు ఆమె అమాయకత్వాన్ని గుర్తించి చిల్లర కూడా ఎగ గొట్టేసినా ఆమె ఏమీ అనేది కాదు. అంతకంటే అనలేకపోయేది అనడమే సమంజసంగా వుంటుంది.

ఒకరోజు ప్రియా వాళ్ళ అమ్మ ప్రియను అదే ఊరిలో వుండే తమ దూరపు బంధువులకు కొన్ని బట్టలు, స్వీట్స్ ఇచ్చి రమ్మని పంపగా అరగంట లోనే ప్రియ ఉత్తి చేతులతో తిరిగొచ్చింది. ఏమయ్యిందని అడుగగా వీధి మొదట్లో ఒక బిచ్చగత్తె ఎదురుపడి కట్టుకోవడానికి బట్టలు లేవని అడగగా ప్రియ మొత్తం బట్టలను స్వీట్స్ లను ఆమెకు ఇచ్చేసి వచ్చానని ఎంతో అమాయకం గా చెప్పింది. ఆ మాటలతో అనసూయకు పట్టరాని కోపం రాగా ఆవేశంతో ఊగిపోతూ ప్రియ రెండు చెంపలను ఎడా పెడా వాయించేసింది.ఎప్పటికి బాగుపడతావే ముదనష్టపు దానా! ఆని ఇష్టం వచ్చినట్లు తిట్టి ప్రియను గదిలోకి తోసేసి తలుపులేసేసింది.

జరిగే తతంగాన్ని చూస్తున్న ప్రియ నాయనమ్మ వచ్చి అనసూయను వారించి ఆ పిల్లది చాలా అమాయకమైన స్వభావం. దానిని మనం మంచి మాటలతో మార్చాలి గాని ఇలా ఆవేశపడితే లాభం లేదని అనునయించి చెప్పింది.ప్రియలో మార్పు తప్పక తేవాలని అప్పటి కప్పుడే ప్రియ నాయనమ్మ నిర్ణయించేసుకుంది.

ఆ రోజు రాత్రి ప్రియ నాయనమ్మ ప్రియ దగ్గరకు వచ్చి మూడు బొమ్మలను ఇచ్చి ఒక దారాన్ని ఒకొక్క బొమ్మ చెవి గుండా ఎక్కించమని చెప్పింది.

నాయనమ్మ చెప్పినట్లే ప్రియ చెసింది. ఆశ్చర్యం కలిగే విధంగా మొదటి బొమ్మ చెవుల గుండా దారం సాఫీగా సాగి పోయింది.” ప్రపంచంలో కొంతమంది ఏ మాటలనైనా ఒక చెవితో విని మరొక చెవితో వదిలేస్తారు. మాటలను ఏ మాత్రం మనస్సుకు పట్టించుకోరు. అలాంటి మనష్యులకు ఈ మొదటి బొమ్మ తార్కాణం. ఇప్పుడు రెండో బొమ్మ చెవుల గుండా దారం పోనివ్వు” అంది నాయనమ్మ.

రెండొ బొమ్మ చెవి నుండి దారం దూర్చగా అది నోట్లో లుంగలు చుట్టుకొని పోయింది.

“ ఈ తరహా మనుష్యులు ఏం వింటారో దానంతటినీ బయటకు చెప్పెస్తారు. దేనిని మమసులో దాచుకోరు ఇక మూడో బొమ్మను ట్రై చెయ్యి” అంది నాయనమ్మ.

ఆ మాటలకు ప్రియలో కుతూహలం ఎక్కువయ్యింది.

మూడో బొమ్మ చెవిలో నుండి వెళ్ళిన దారం బయటకు రాలేదు.

“ ఇటువంటి మనష్యులు చాలా వింటారు కాని కొంచెమే మాట్లాడుతారు. పై రెండు బొమ్మల లాగే ఈ లక్షణం కూడా మంచిది కాదు” చెప్పింది నాయనమ్మ.

‘అయితే ఎటువంటి ప్రవర్తన మంచిదనిపించుకుంటుంది నాయనమ్మా ?”ఆసక్తిగా అడిగింది ప్రియ. ఆమె ముఖ కవళికలు బట్టి ఆమెపై తన మంత్రం పని చెస్తోందని గ్రహించింది నాయనమ్మ. వెంటనే వెళ్ళి నాలుగో బొమ్మ తెచ్చి ప్రియకు ఇచ్చి “ దీనిని ప్రయత్నించు” అని చెప్పింది.

ఎడమ చెవి గుండా ప్రియ దారం పోనివ్వగా అది రెండో చెవి నుండి బయటకు వచ్చింది.

“ఇంకొక సారి ప్రయత్నించు” చెప్పింది నాయనమ్మ.

ఈసారి చెవిలో నుండి పంపగా దారం నోట్లోంచి బయటకు వచ్చింది.

ముచ్చటగా మూడొసారి ట్రై చెయ్యగా చెవిలోంచి పంపించిన దారం అసలు బయటకు రాలేదు.

ఫై మూడింటి కంటే ఇదే మంచి బొమ్మ.ఈ బొమ్మకు ఎప్పుడు వినాలో, ఏం వినాలో,ఎప్పుడు మాట్లాడాలో, ఏమి మాట్లాడాలో, ఏది మాట్లాడకూదదో , ఎప్పుడు మౌనంగా వుండాలో తెలుసు. సంధర్భాన్ని బట్టి దీని ప్రవర్తన మారుతుంటుంది.ఇటువంటి ప్రవర్తన కలిగినవారే ఉత్తములు.వారే జీవితంలో బాగా రాణిస్తారు” అని ప్రియను అక్కున చేర్చుకొని ముద్దు పెట్టుకుంది నాయనమ్మ.” నా పిచ్చి తల్లీ. మంచితనం వుండడం తప్పుకాదు కాని అది చేతకానితనంగా మారకూడదు.ఇతరులకు మనకు వున్న దాంట్లో కొంత ఇవ్వడం లో తప్పులేదు కాని అవసరం వున్నవారికే ఇవ్వాలి, లేకపోతే నీ దానం పనికి రాకుండా పోయే ప్రమాదం వుంది. మోసం చెయ్యడం ఎంత తప్పో మోసగింపబడడం కూడా అంతే తప్పు. ఇదే నువ్వు ఈ నాలుగు బొమ్మ ల నుండి నేర్చుకోవలసింది” అని అనునయం గా చెప్పింది నాయనమ్మ.
ఆనాటి నుండి ప్రియ అవసరం వున్నప్పుదే మాట్లాడడం,అపరిచితులను దూరంగా వుంచడం, అవసరం వున్నా వారికే సహాయం చేయడం మొదలు పెట్టింది. అసలే మంచి పిల్ల అయిన ప్రియ తన మారిన ప్రవర్తనతో ఇంకా మంచి పిల్లగా పేరు తెచ్చుకుంది.

నీతి: ఎప్పుడు మాట్లాడాలో, ఏది మాట్లాడాలో, ఎవరికి సహాయం చెయ్యాలో తెలుసుకోవడం చాలా అవసరం. ఆపరిచితుల పట్ల తస్మాత్ జాగ్రత్త.మంచితనం చేతగానితనంగా మారకుండా చూసుకోండి.

Saturday, December 11, 2010

ఆతిధి దేవో భవ ……..

కౌసల దేశాన్ని ఏలే విక్రమ సేనుడు తన ప్రధాన మంత్రితో కలిసి ఒకరోజు రహస్య రాజ్య పర్యటనకు బయలుదేరాడు. తన రాజ్యంలో ప్రజల స్థితి గతుల గురించి అధ్యయనం చేద్దామని అనంతరం ఎవరైతే అతిధుల పట్ల అత్యున్నత రీతిలో గౌరవం కనబరుస్తారో వారికి బహుమానం ఇద్దామని మహారాజు మంత్రితో చెప్పాడు.

ఆ రోజు సాయంత్రం ఇద్దరూ వెళ్ళి ఒక ఇంటి తలుపు తట్టారు. తలుపు తెరచిన ఇంటి యజమానితో ‘అయ్యా, మేము పొరుగు రాజ్యం నుండి వర్తకం చెయ్యడానికి వచ్చాం. ఈ రాత్రికి మీ ఇంట్లో కాస్త తల దాచుకోనిస్తే ఉదయాన్నే లేచి వెళిపోతాం. మాకు ఈ వూరిలో ఎవ్వరూ తెలియదు. దయ చెసి మాకు సహాయం చెయ్యండి” అని అభ్యర్ధించారు.

ఆ మాటలు విన్నంతనే ఆ ఇంటి యజమాని కోపంతో మండిపడ్డాడు. “ భలేవాళ్ళె మీరు. ముక్కు ముఖం తెలియని వారికి ఇంట్లో ఎలా తల దాచికోనిస్తాం ? మీరు దొంగలు కారన్న నమ్మకం ఏమిటి ?అయినా అడ్డమైన వాళ్ళ్కు ఆశ్రయం ఇవ్వడానికి నా ఇల్లేమైనా ధర్మ సత్రం అనుకున్నారా ? ఇంకొక్క క్షణం లో ఈ ఇక్కడి నుండి వెళ్ళకపోతే రాజ భటులను పిలవాల్సి వస్తుంది” అని పెద్దగా అరుస్తూ తలుపు వాళ్ళ ముఖం మీదే వేసేసాడు.

అప్పుడు వారిద్దరూ మరొక ఇంటి తలుపు తట్టి ఇంతకు ముందు లాగే ఎంతో వినయంతో అభ్యర్ధించారు.

ఆ ఇంటి యజమాని “ అయ్యా ! నా ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే.ముందు మీరు ఎంత మంది వున్నారో లెఖ్ఖ సరిగ్గా చెబితే అప్పుడు ఆలోచిస్తాను” అని అన్నాడు. ఆందుకు మహారాజు” అయ్యా ! మేము ఇద్దరమే వున్నాము. మా వద్ద చెల్లించుకోవడానికి అట్టె ధనం లేదు. ఈ రేత్రికి మీ ఇంట్లో తల దాచుకోనివ్వండి. ముందుగా మేము దైవ దర్శనం చేసుకొని వస్తాం” అని చెప్పి ముందుకు కదిలారు.

తర్వాత వారు ఇంకొక ఇంటి తలుపు తట్టారు. ఇంటి యజమానిని అదే విధంగా అడగగా అతను ఎంతో వినయంతో తలుపులు తెరిచి “దయ చేసి లోపలికి రండి ,ఈ ఇంటిని మీదిగా భావించి విశ్రాంతి తీసుకొండి. ఆతిధి అభ్యాగతులను గౌరవించడం మా రాజ్యం యొక్క సంప్రదాయం” అంటూ వారిని ఎంతో సాదరంగా ఆహ్వానించాడు. ఆ ఇంటి యజమాని ఆర్ధిక పరిస్థితి అధ్వాహ్నంగా వుంది అయినా వున్నంతలోనే వారిదరికీ స్వాగత సత్కారాలను చేసాడు. ఈ ఇంటి కుటుంబ సభ్యులు కూడా అతిధుల పట్ల ఎంతో ప్రేమానురాగాలను కనబరిచారు.

మర్నాడు రాజ్యానికి తిరిగి వెళ్ళిన మహారాజు ముగ్గురు ఇంటి యజమానులను పిలిచి వారితో ఇలా అన్నాడు.

మొదటి వానితో “ ఇంటికి ఆశ్రయం కోసం వచ్చిన వారిని కన్ను మిన్ను కానక నువ్వు తీవ్రంగా అవమాన పరిచావు. నీ వంటి వాడు ఈ రాజ్యంలో వుండదానికి అనర్హుడు “ అని వానికి దేశ బహిష్కార శిక్ష ను విధించాడు.

రెండవ వ్యక్తితో” నువ్వు ముందు వాని వలే కాక కనీసం ఎందరు వున్నారన్న దానిని బట్టి ఆశ్రయం ఇచ్చేదీ లేనిదీ నిర్ణయించుకున్నావు. నీ ఆర్ధిక పరిస్థితి నీ చేత ఆ విధంగా ఆలోచింప చేసింది. అందుకని నీ ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచడం అవశ్యం. వున్న దానిలో కొంతదానిని ఇతరులకు పంచాలన్న నీ ఆలోచనను ఎన్నడూ విడవకు" అంటూ వానికి కొంత ధనం ఇచ్చి పంపేసాడు.

మూడవ వ్యక్తిని మహారాజు దుశ్సాలువతొ సన్మానించి లెఖ్ఖ లేనంత ధనాన్ని, బంగారాన్ని ఇచ్చి” ఆగర్భ దారిద్రంలో మునిగి వున్నా తనకు చేతనైనంతలో పరులకు సహాయం చెయ్యాలన్న గొప్ప సంస్కారం నీకు వుంది. ఆతిధులను సాక్షాత్తు భగవంతునిగా చూసే ఈ రాజ్యపు సంస్కృతి సాంప్రదాయాలను ఆచరణలో చూపించావు ” అంటూ అతనికి తన రాజ్యపు కొలువులో ఒక చక్కని ఉద్యోగం ఇచ్చాడు.

ఆతిధులను ఎలా గౌరవించాలో తెలియజేసే భావ గర్భితమైన కధ ఇది. ఇందులో నుండి ప్రతీ ఒక్కరం చాలా విషయాలను నేర్చుకోవలిసి వుంటుంది.

మాతృదేవో భవ..పితృదేవోభవ,…ఆచార్య దేవోభవ, ..అథిది దేవో భవ అన్నది వేదోక్తి.అవసరార్ధం మనింటికి వచ్చే అతిధులను సాదరంగా ఆహ్వానించి చేతనైనంతగా గౌరవ మర్యాదలను చూపించాలని మన శాస్త్రం తెలియజేస్తోంది. ఆతిధిని గౌరవించిన చోట దేవతలు నివాసం చేస్తారని అంటారు.అతిధుల విషయం లో కుల, మత, ప్రాంతీయ బేధాల పట్టింపులు చూపకూడదు. ఆతిధులు సంతృప్తి చెందితే యజమానికి సర్వ సౌఖ్యాలు లభిస్తాయన్నది నిర్వి వాదాంశం. కానీ ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్నదేమిటి ? ప్రపంచీకరణ నేపధ్యంలో మన జీవితాలలో వేగం పెరిగింది. లెఖ్కకు మించి వస్తున్న ఉపకరణాల వలన మానవుల అహం పెచ్చు పెరిగింది. సంబంధ బాంధవ్యాలు పూర్తిగా నశించిపోయాయి. ఇచ్చి పుచ్చు కోవడం లోనూ, కలిసి మెలిసి జీవించడం లోనే అసలైన ఆనందం దాగి వుందీన్న సంగతిని పూర్తిగా మర్చిపోయాం.సహాయార్ధం ఎవరైనా ఇంటికి వస్తే ముఖం చిట్లిస్తాము. వచ్చిన వారిని గుమ్మంలోనే నిలబెట్టి మాట్లాడే సంస్కృతి వచ్చింది. టైమునప్పుడు టి విలు, కంప్యూటర్లు, వీడియో గేంస్ లతో కాలక్షేపం చేస్తున్నాం తప్ప ఒకరి ఇంటికి వెళ్ళడం, ఇంకొకరిని మన ఇంటికి ఆహ్వానించడం లాంటి సహ జీవన సంస్కృతికి పూర్తిగా దూరమైపోయాము. కొన్ని ప్రధాన నగరాలలో అయితే అప్పాయింట్ మెంట్ తిసుకోకుండా వస్తే ఎందుకు వచ్చారని ముఖంమీదే తలుపులేసేసే పరిస్థితి వుంది.
మనుషిని మనిషిగా చూడాలి. ఫరులకు వీలైనంతగా సహాయం చెయ్యాలి.ఇంటికి వచ్చిన వారిని ఆదరించడం, తోచిన విధంగా సత్కార్యం చెయ్యడం మన విధి. దీనిని విస్మరించిన నాడు మన మనుగడకు అర్ధం లేదు.

Tuesday, December 7, 2010

యధ్భావం తధ్భవతి

శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీతలో నా భక్తులు నన్నే విధముగా భావిస్తారొ నేను అదే విధంగా వారికి దర్శనమిచ్చి వారి సకల కొరికలను తొరుస్తానని ప్రవచించారు. కలియుగ దైవం, భక్తుల పాలిటి కల్పవృక్షం, సమర్ధ సద్గురువు అయిన శ్రీ సాయినాధులు తన భక్తులు తనను ఏ విధంగా భావించారో వారికి ఆదే రూపంలో దర్శనమిచ్చిన సంఘటనలు శ్రీ సాయి సచ్చరిత్రలో అనేకం కనిపిస్తాయి. మారుతి, వెంకటేశ్వరుడు, దుర్గాదేవి, నరసింహ స్వామి,దత్తాత్రేయుడు ఇలా ఎందరో భక్తులు వారు భావించిన విధంగా దర్సనమిచ్చిన వైనం అద్వితీయం, అపుర్వం, అసామాన్యం అని చెప్పక తప్పదు. అట్లే కలియుగం లో ఈ భువిపై అవతరించిన శ్రీపాద శ్రీ వల్లభులు,నరసింహ సరస్వతి,రమణ మహర్షి, లహరి మహాశయులు ఇత్యాది సద్గురువులు తమ భక్తులకు ఇటువంటి మహత్తర అనుభవాలను ప్రసాదించారు. దీనినే శాస్త్రం యద్భావం తద్భవతి అని ప్రభోదిస్తొంది అంటే భావం బట్టే ఫలితం.

మన మనసులో ఎటువంటి ఆలోచనలు ప్రవేశిస్తాయో ఫలితాలు అదే విధంగా వుంటాయి అనడానికి ఉదాహరణ ఈ క్రింది కధ :

ఒక లోభి అయిన సన్యాసి తన గురువు వద్ద ఉపదేశం తీసుకొని భగవంతుని కోసం తీవ్రంగా తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమై తన మనస్సులో మూడు సార్లు ఏమైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందని వరం ఇచ్చాడు.

వెంటనే ఆ సన్యాసి మహదానంద భరితుడై ఈ లోకంలోనే ఇప్పటి వరకు లేని విధంగా సకల సదుపాయాలు గల ఒక భవంతిని కావాలనుకున్నాడు. క్షణాలలో ఒక దివ్య భవంతి అక్కడ ప్రత్యక్షమయ్యింది. రెండు రోజులపాటు ఆ భవంతిలో సకల రాజ్య భోగాలు అనుభవించాక తనకు తోడుగా ఒక దేవ కన్య వుంటే ఈ సుఖాలను మరింత అద్భుతంగా, సంతృప్తి కరంగా అనుభవించవచ్చునని కోరుకున్నాడు. వెంటనే జగదేక సుందరి అయిన ఒక దేవ కన్య ప్రత్యక్షమయ్యింది. ఆమె చూడగానే తన జన్మ ధన్యమయ్యిందని భావించి ఆమెతో శృంగార కార్యకలాపలలో తేలిపోయాడు. రొజులు, వారాలు, నెలలుగా గడిచాయి. ఈ హడావిడిలో తనకు ఒకే కోరిక మాత్రం తీర్చుకోగలడన్న విషయం మరిచిపోయాడు ఆ సన్యాసి.
ఒక రోజు మధువు, మగువ మైకంలో వున్న అతడు " ఏ జన్మలోనో పుణ్యం చెసుకోబట్టి ఇంతటి అద్భుతమైన జీవితం అనుభవిస్తున్నాను. ఒక వేళ పొరపాటునో గ్రహపాటునో ఈ సిరి సంపదలన్నీ మాయమైపోయి నేను ఇంతకు ముందు కంటే బికారిని అయిపోయి తిండి కూడా లేక కుక్క చావు చస్తేనో ?" అని అనుకున్నాడు. వెంటనే దేవుడు ఇచ్చిన వరం ఫలితంగా అతను అనుభవించే సిరి సంపదలు మొత్తం మాయమైపోయి ఒక్కసారిగా బికారి అయిపోయాడు. అంతే కాక తన ఆలోచన ఫలితంగా తిండికి కూడా గడవని పరిస్థితి వచ్చి నిజంగానే దుర్భరమైన మరణం పొందాడు.

అన్ని ఆలోచనలకూ మన మనస్సే కేంద్ర బిందువు. మంచి ఆలోచనలను మానవుల అభివృద్ధికి ప్రాణవాయువు వంటివి.అవి మనలను సన్మార్గంలో నడిపిస్తాయి.చెడ్డ ఆలోచనలు తులసి వనంలో గంజాయి మొక్కల వంటివి. మానవాళిని అధమ : పాతాళానికి తొక్కివేస్తాయి. రెండవ ప్రపంచ యుద్దంలో ఒక దేశాధినేతకు కలిగిన ఒక చెడ్డ ఆలోచన అణుబాంబును జపాన్ లోని హోరొషిమా పై వేసి లక్షలది మంది మరణానికి కారణమయ్యింది. అణుబాంబు లోని అదే ఇంధనాన్ని మానవాళికి ఉపయోగపడేలా చేయాలన్న అబ్ధుల్ కలాం వంటి మహోన్నత వ్యక్తులకు కలిగిన ఒక మంచి ఆలోచనకు ప్రతిరూపం ఇప్పుడు కార్య రూపం దాలుస్తోంది.ఇక భవిష్యత్తులో మన దేసంలో ఇంధన కొరత వుండదని నిపుణులు భావిస్తున్నారు.

మనం ఈ సమాజానికి ఏది ఇస్తామో అదే తిరిగి మనకు లభిస్తుంది. ఇతరులకు దుఖం ఇస్తే దుఖం, ఆనందం ఇస్తే ఆనందం, సహాయం చెస్తే అదే సహాయం వెయ్యింతలై ఏదో ఒక రుపెణా మనకు లభిస్తుంది.మన ఆలోచనలే మన భవిష్యత్తుకు పునాది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అన్నది విజ్ఞుల ఉవాచ. మంచిని చెస్తే మనకు మంచే కలుగుతుంది. మంచిని చెయ్యాలంటే మంచి ఆలోచనల ఆవశ్యకత ఎంతైనా వుంది. ఒక మంచి ఆలోచన పరిధి ఎంతో గొప్పది. వైరస్ వలే త్వర త్వరగా ఇతరులకూ వ్యాపిస్తుంది. మంచి ఆలోచనలు తద్వారా మంచి పనుల వలన మనకు లభించే సుఖ సంతోషలు, శాంతి సౌభాగ్యాలను చూసి ఇతరులు కూడా స్పూర్తి తో అటువంటి మంచి పనులను చేయడానికి ఉద్యుక్తులౌతారు. సత్కర్మల వలన విశ్వశాంతి, సమాజ శ్రేయస్సు వృద్ధి చెందుతాయి. అప్పుడు ప్రపంచం ఒక నందన వనం అవుతుంది.

సర్వేజనా సుఖినోభవంతు
లోకాస్సమస్తా సుఖినోభవంతు

Tuesday, November 23, 2010

సజ్జన సాంగత్యం

సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చల తత్వం
నిశ్చల తత్వే జీవన్ముక్తి:

సాక్షాత్తూ ఆదిగురువైన శ్రీ శంకర భగవానుని దివ్య అవతారమైన ఆది శంకరాచార్యుల వారు రచించిన భజ గోవిందం లోని పై శ్లోకం సత్సంగం యొక్క ప్రాముఖ్యాన్ని అపూర్వం గా వివరిస్తుంది. సత్సంగం అంటే సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం బహు అమూల్యమైనది.ఎన్నో జన్మల పుణ్య ఫలితం వలనే సత్సంగం సిద్ధిస్తుంది.సజ్జన సాంగత్యం నిస్సంగత్వం అనగా వివేక వైరాగ్యాలను, నిస్సంగత్వం నిర్మొహత్వం అంటే మాయ నుండి విడిపడిన పరిస్థితి, నిర్మోహత్వం నిశ్చలతత్వాన్ని అనగా మనస్సు చంచలత్వం పొందని స్థితిని ప్రసాదిస్తాయి.ఆఖరుగా నిశ్చలతత్వం జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది. సాక్షాత్తు దైవ స్వరూపులైన మానవుల లక్ష్యం జొవన్ముక్తియే కదా!

మనం నిత్య జీవితం లోచేసే సాంగత్యం పై మన జీవితం, మన ఉన్నతి అధారపడి వుంటాయి.అది మన మనస్సులను, భవిష్యత్తును మన ఆత్మను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దుర్జనుల సాంగత్యం లో మనకు దురలవాట్లు అబ్బుతాయి. వారితో కలిసి ఎన్నో పాప కార్యాలను చేస్తాం. తిరిగి వాటిని మనమే అనుభవిస్తూ అంతులేని దూఖాన్ని పోగుచేసుకుంటాము. సజ్జన సాంగత్యం మన ఉన్నతికి ఎంతగానో దోహదపడుతుంది. ఈ పంధాన నడవక పోతే పాప కార్యాల పంకిలంలో పడి చేసిన కర్మల తాలూకూ ఫలితాన్ని అనుభవించదానికి ఎన్ని జన్మలైనా జనన మరణ చక్రభ్రమణంలో కొట్టు మిట్టాడుతునే వుంటాము. అందుకే ఆత్మ సాక్షాత్కారం పొందిన ఒక సద్గురువును ఆశ్రయించడం ఎంతో అవశ్యం. వారు మనకు జీవన్ముక్తిని సాధించే మార్గాన్ని చూపిస్తారు. ఆందువలన ఆత్మ జ్ఞానాన్ని మనకై మనం వెతుక్కోవల్సిన పని లేదు. సద్గురువులకు త్రికరణ శుద్ధిగా సర్వశ్య శరణాగతి చేస్తే చాలు.

ఓ మానవుడా! జ్ఞాన వంతుల ,సద్భుద్ధి గల సజ్జనుల సాంగత్యంలో జీవితాన్ని గడుపు. ఆందువలన వారి జ్ఞానం, నీకు సంక్రమించి నువ్వు కూడా ఉద్ధరించబడతావు. భగవంతుని అపూర్వమైన , అపారమైన కరుణా కటాక్షాలకు పాత్రుడవౌతావు. లేకుంటే నరక ప్రాప్తియే గతి అంటూ శంకర భగత్పాదులు మానవులకు పై శ్లోకం ద్వారా కర్తవ్య బోధ చేసారు.

సజ్జన సాంగత్యం యొక్క ప్రాశస్తిని ఇంతకంటె అద్భుతంగా ఇంకెవరు వివరించగలరు ?

సత్సంగం మరియు సజ్జన సాంగత్యం యొక్క ప్రాశస్తిని వివరించే మరొక అద్భుతమైన కధను ఇప్పుడు స్మరించుకుందాం :

నాగరాజైన ఆదిశేషుడు సమస్త భూమండలాన్ని తన వేయి పడగలపై మోస్తున్నాడు. ఒక రొజు బ్రహ్మ దేవునికి దీటుగా సృష్టికి ప్రతి సృష్టి గావించిన రాజర్షి అయిన విశ్వామిత్రుడు వచ్చి నాగరాజును తనతో రమ్మన్నాడు. ఆందుకు ఆదిశేషుడు మిక్కిలి వినయ విధేయతలతో “ ఓ బ్రహ్మర్షి! ఈ సమస్త భూమండలం నా శిరస్సుపైనే వుంది. దీనిని పరిరక్షించడమే నా కర్తవ్యం. నేను ఈ కార్యాన్ని విస్మరించినట్లైతే ఈ భూమండలం పాతాళం వైపు పడిపోవడం తధ్యం. అప్పుడు అనేక కోట్ల జీవ రాశులు నాశనమైపోతారు” అన్నాడు.

ఆందుకు విశ్వామిత్ర మహర్షి చిరునవ్వు నవ్వి “ అటువంటిదే గనక జరిగితే నేను నా అమోఘమైన తపశ్సక్తితో దానిని ఆపుతాను” అన్నాడు.
అందుకు నాగరాజు ఒప్పుకోలేదు. విశ్వామిత్రుడు ఎన్ని విధాలుగా నచ్చ జెప్పి చూసినా ఆదిశేషుడు తన నిర్దేశిత కార్యాన్ని వదలనని మొండిపట్టు పట్టాడు. ఆదిశేషుని మంకుపట్టు చూసి విశ్వామిత్రునికి తీవ్రమైన కోపం వచ్చింది. కమండలం ఎత్తి శపించబోయేంతలో ఆదిశేషుడు భయపడి ఇక చేసేది లేక భూమిని పక్కకు పెట్టి వచ్చాడు.

అంతలొనే ఘోరమైన విపత్తు సంభవించింది. ఇన్ని వేల యుగాలుగా ఆదిశేషుని వేయిపడగలపై బధ్రంగా వున్న భూగొళం వెంటనే పాతాళం వైపు పడిపోవడం ప్రారంభించింది. దానిపై నివాసముంటున్న వేల కోట్ల జీవరాశులు ప్రాణ భయంతో ఆర్తనాదాలు చేయడం ప్రారంభించాయి.
ఆదిశేషుడు జరిగిన దానిని చూసి తీవ్రమైన దుఖంతో మాంపడిపోగా తప్పశ్శక్తి సంపన్నుడన్న గర్వంతో విశ్వామిత్రుడు కమండలం లోని నీరు ధారపొసి ఆగు అంటూ భూమిని ఆజ్ఞాపించాడు. భోగోళం పతనం ఆగలేదు. పైపెచ్చు ఆది మరింత వేగంగా పడిపోవడం ప్రారంభించింది. అప్పుడు విశ్వామిత్ర మహర్షి పట్టరాని ఆగ్రహంతో “ నా తప శ్సక్తి అంతా ధారపోస్తున్నాను,వెంటనే ఆగు” అంటూ ఆజ్ఞాపించాడు.అయినా ఫలితం లేకపోయింది.

అప్పడు విశ్వామిత్రునికి అహంకార మైకం తొలిగిపోయింది. భూమిని ఆపడానికి తన తప: శ్సక్తి చాలదని తెలుసుకున్నాడు. ఏం చేయలా అని ఆలోచిస్తుండగా నారద మహర్షి అక్కడికి వచ్చి జరిగిన దానిని తెలుసుకొని” ఓ మహర్షి! నీవు ఎప్పుదైనా సజ్జన సాంగత్యం చేసి వుంటే ఆ ఫలితాన్ని వెంటనే ధారపొయు. భూపతనం ఆగిపోతుంది” అని సెలవిచ్చాడు.

అప్పుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు.తాను అందరితో తగవులు పెట్టుకోవడమే కాని సజ్జన సాంగత్యం చేసింది లేదు.సాటి ముని పుంగవులతో సజ్జన సాంగత్యం , సత్సంగం చేసింది కూడా లేదు.అయినా తాను వశిష్ట మహర్షి వద్దకు వెళ్ళిన సంగతి జ్ఞప్తికి తెచ్చుకొని ఆ పుణ్యాన్ని ధారపోయగా వెంటనే భూగోళ పతనం ఆగిపోయింది. ఆది శేషుడు యధావిధిగా తిరిగి భూమండలాన్ని తన తలకు ఎత్తుకున్నాడు.

మానవులలో దానవ మానవ గుణాలు రెండూ నిక్షిప్తమై వుంటాయి.సమయం సంధర్భం బట్టి ఏదో ఒక గుణం బయటకు ప్రకటితమౌతూ వుంటుంది. దుర్జనులతో సాంగత్యం చెస్తే అసుర గుణం బలీకృతమై ఎన్నో చెడ్డ పనులను చేస్తాం.

అందు వలన పైన వివరించినట్లుగా చెసిన పాప కర్మల తాలూకు ఫలితాన్ని అనుభవించేందుకు జనన మరణ చక్ర భ్రమణంలో పడిపోతాం.సజ్జన సాంగత్యం మనలో రజో తమో గుణాలను తగ్గించి సాత్విక భావాలను పెంచుతుంది.భగవత్ ధ్యానం, నామ స్మరణ,సంఘ సేవ, యజ్ఞ యాగాదులను నిర్వహించుట,పరుల పట్ల కరుణా కటాక్షాలను కలిగి వుండుట వంటి చక్కని కర్మలను చేసేందుకు ఎంతగానో సజ్జన సాంగత్యం తోడ్పడుతుంది. ఎక్కడ సత్సంగం జరుగునో అచ్చట దేవతలు స్థిర నివాసం చెస్తారన్నది శాస్త్ర వాక్యం. సత్కర్మలు భగవంతుని సన్నిధికి చేరేందుకు దారి చూపిస్తాయి.

కలి ప్రాభావాం అధికంగా వున్న ఈ రోజులలో సత్సంగం అంత త్వరగా దొరకదు. మానవులు ధనార్జనే ముఖ్య ధ్యేయం గా బ్రతుకుతూ మానవతా విలువలకు త్రిలోదకాలిస్తున్నారు.అరిష డ్వర్గాలకు బానిసలైపోతూ దానవ గణానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు.మంచితనం అన్నది మచ్చుకైనా కనిపించదం లేదు.

అంతటా స్వలాభం, స్వార్ధం, అవినీతి, హింసా విలయ తాండవం చేస్తున్నాయి.అటువంటి పరిస్థితులలో సత్సంగం దొరకడం బహు కష్టం. కాని ఆశావహ ధృక్పధంతో, సానుకూలంగా యత్నిస్తే సజ్జన సాంగత్యం దొరకడం కష్టమే కాని దుర్లభం కాదు. అయితే ఈ సత్సంగం అనే పూదోతలో కలుపు మొక్కలు విరివిగా మొలకెత్తడం అనివార్యం. అట్టివారి మాయలో పడక,అప్పడప్పుడు ఆ కలుపు మొక్కలను ఏరిపారవేయడం చేస్తుండాలి.లేకపోతే అద్బుతమైన పూదొట కలుపు వనంగా మారే ప్రమాదం వుంది. ఒక్క సజ్జనుడి పక్కన నిలబడితే అంత పుణ్యం లభిస్తుందని పైన వివరించిన కధ ద్వారా మనకు తెలిస్తే ఇక సాత్విక భావ సంపన్నులైన అనేక మంది సజ్జనులతో కలిసి నిత్య సహవాసం ఇంకెంత పుణ్యం సంప్రాప్తిస్తుందో కదా !

సజ్జన సాంగత్యం లోని గొప్పదనాన్ని గుర్తెరిగి, వారి కోసం కృషి చేసి అట్టి సాంగత్యాన్ని తనివి తీరా అనుభవించి శాశ్వతానందం పొందడమే మన తక్షణ కర్తవ్యం.

Sunday, October 3, 2010

బుద్ధ భగవానుని దివ్యోపదేశం

మహారాజు కుటుంబం లో పుట్టి యవన వయస్కుడయ్యే వరకూ సకలైశ్వర్యాలను అనుభవించి తర్వాత చుట్టు వున్న ప్రపంచంలో ప్రజలు అనుభవిస్తున్న బాధలను ఓర్వలేక , రాజభోగాలన్నింటినీ పరిత్యజించి సత్యాన్వేషణలో బయలుదేరి , వివేక వైరాగ్యములతో కఠోర సాధన గావించి తుదకు బోధి చెట్టు కింద తీవ్రమైన తపస్సులో మునిగి వుండగా జ్ఞాదయం చెంది, సత్య దర్శనం పొంది బుద్ధుడిగా మారిన గౌతముని జీవితం సకల ప్రాణకోటికి ఆదర్శం. సత్యం, ధర్మం, న్యాయం, కరుణ, జాలి, ప్రేమ ఇత్యాది సద్గుణములను అలవరచుకొని, దానవ గుణమును త్యజించి మానవునిగా ప్రవర్తించి భగవంతుని కరుణకు పాత్రులు కావడమే మానవుల ముఖ్య కర్తవ్యమని బుద్ధ భగవానుడు తరచుగా ప్రభోధిస్తుండేవారు. ఆ మహనీయుని జీవిత చరిత్రలో ఇప్పుడు ఒక అపూర్వమైన ఘట్టమును స్మరించుకుందాం :

బుద్ధ భగవానుడు తన ఆశ్రమం లో తన ఆసనం పక్కన ఒక ఢమరుకాన్ని వుంచుకునేవారు.ప్రతీ దినం దానిని తానే స్వయంగా శుభ్రం చేసుకునేవారు. ఎన్ని నెలలైనా దానిని ఆయన ఒక్కసారి కూడా వుపయోగించిన పాపాన పోలేదు. ఒక రోజు శిష్యులందరూ కూడ బలుక్కొని “ భగవాన్, ఈ ఢమరుకాన్ని తమరి చెంత ఎప్పటి నుండో వుంచుకుంటున్నారు, కాని ఒక్కసారి కూడా వుపయోగించలేదు, కారణం ఏమిటో దయచేసి సెలవియ్యండి” అని అడిగారు.

అందుకు బుద్ధుడు చిరునవ్వుతో “ నాయనలారా ! ఏ రోజునైతే అతి గొప్ప త్యాగం చేసిన వ్యక్తి నా దగ్గరకు వస్తాడో ఆనాడే ఈ ఢమరుకాన్ని నేను స్వయం గా వాయిస్తాను, ఇంతవరకు అటువంటి త్యాగధనుడు నా వద్దకు రాలేదు కనుక దీనిని వుపయోగించలేదు” అని అన్నారు.
ఈ వార్త ఆ నోటా ఈ నోటా ఆ రాజ్యమంతా పాకింది. తాము త్యాగధనులని నిరూపించుకోవడం కోసం ఎందరెందరో ధనికులు వచ్చి బుద్ధుని దర్శనం చెసుకొని ఎన్నో విలువైన కానుకలను అర్పించుకొని, తమను ఆశీర్వదించమని కోరసాగారు, వైరాగ్యానికి మారు పేరైన బుద్ధ భగవానుడు వాటిని తాకనైనా తాకలేదు. దాంతో తమ త్యాగాన్ని బుద్ధుడు గుర్తించనందుకు వారంతా నిరాశతో వెళిపోసాగారు. అందులో కొంతమంది కుత్సితులు బుద్ధుడిని విమర్శించడం కూడా చేసారు.

ఒకరోజు ఆ దేశాన్ని ఏలే మహరాజు బుద్ధుడిని దర్శింపదలచి ఎన్నో విలువైన కానుకలను తీసుకొని తన పరివారంతో బయలుదేరాడు. దారిలో అతని పల్లకికి ఒక పండు ముసలిది అడ్డం వచ్చి ఆకలిగా వున్నది , కాస్త అన్నంపెట్టండి” మహారాజును ప్రాధేయపడింది. మహారాజు వెంటనే జాలితో ఒక మామిడి పండును ఆమెకు ఇచ్చాడు.

కొంత సేపటికి మహారాజు బుద్ధుని ఆశ్రమానికి వచ్చి తాను తెచ్చిన విలువైన కానుకలను అర్పించుకొని పాదాభివందనం చేసి ఒక పక్కన నిలబడ్డాడు. బుద్ధ భగవానులు అప్పుడు తీవ్రమైన ధ్యానంలో మునిగి వున్నారు.

అప్పుడే ఆ ముసలి కూడా వచ్చి బుద్ధునికి నమస్కారం చేసి మహనీయుల వద్దకు ఖాళీ చేతులతో వెళ్ళకూడదన్న నియమాన్ని అనుసరించి తనకు మహారాజు ఇచ్చిన మామిడి పండును అర్పించుకుంది.

వెంటనే బుద్ధ భగవానుడు కళ్ళు తెరిచి ఆ పండును అందుకొని ఎంతో ఇష్టం గా భుజించి పక్కనే వున్న ఢమరుకాన్ని మోగించారు.

అందరూ ఆశ్చర్యపోయారు. బుద్ధుని చర్య ఎవ్వరికీ అంతు పట్టలేదు.

మహారాజు అహంకారంతో ఎగిరిపడ్డాడు. బుద్ధుడు తనను పరాభవించినట్లు తలచుకొని “ అయ్యా! మీ చర్య పక్షపాత ధోరణితో కూడుకొని వున్నది. నేను మీకు ఎన్నో విలువైన ఆభరణలను, వజ్ర వైఢూర్యాలను సమర్పించుకున్నాను. తమరు ధ్యానంలో వుండి వాటిని కనీసం చూడనైనా చూడలేదు. తమకు తపో భంగం కలిగించకుడదని నేను ఎంతో సేపటి నుండి వేచి చూస్తున్నాను. ఒక్క చిల్లి గవ్వయినా విలువ చేయని ఈ ముదుసలి నేను భిక్షగా ఇచ్చిన పండును తీసుకొని మీవద్దకు వస్తే మీరు వెంతనే కళ్ళు తెరిచి దానిని భుజించడమే కాక ఆమె ఎంతో గొప్ప త్యాగం చేసినట్లు ఢమరుకాన్ని మోగించారు. ఇది నాకెంతో అవమానం కలిగింది. దయ చేసి మీ వింత ధోరణికి మాకు క్షమార్పణ చెప్పండి” అని హుంకరించాడు.

అప్పుడు దయా సముద్రుడైన బుద్ధ భగవానుడు ఎంతో ప్రేమతో కూడిన స్వరంతో “ నీవు అజ్ఞానంలో వున్నావు కాబట్టి వాస్తవాలను తెలుసుకోలేక నా చర్య వలన అవమానం పొందినట్లు అనుకుంటున్నావు. త్యాగం అనే పవిత్రమైన కార్యక్రమంలో ఎంత చేసావన్నది కాదు ఏమి చేసావన్నది ముఖ్యం.భావం బట్టే ఫలితం ఆధారపడి వుంటుంది. నీ వద్ద పర్వతం తో సమానమైన ఆస్థి పాస్థులు వున్నాయి. నీ తర్వాత వందల తరాలు తిన్నా కరిగి పోని భోగ భాగ్యాలు నీ స్వంతం. నువ్వు నా వద్దకు వచ్చినప్పుడు రాజుననే అహంకారంతో కానుకలను నాకు సమర్పించావు. వాటికి ప్రతిఫలంగా నా వద్ద నుండి దాత అనే గుర్తింపు పొందాలని ఆశించావు. కాని ఈ ముదుసలిది కూటికి గతి లేనిది. ఎన్నో రొజులు పస్తులు వున్న తర్వాత నీ దగ్గరకు భిక్షకు వచ్చి నువ్వు ఇచ్చిన మామిడి పండును తినబోతుండగా దారిలో పోయేవారు నా గురించి చెప్పగా విని, నా దర్శనం చేసుకుందామన్న అభిలాషతో తన వార్ధ్యకాన్ని, నడవలేని స్థితిని కూడా లెఖ్ఖ చెయ్యక నా వద్దకు పరుగు పరుగున వచ్చింది. పెద్దవారి వద్దకు వట్టి చేతులతో వెళ్ళకూడదన్న నియమాన్ని అనుసరించి కడుపులో మెలి పెడుతున్న తన ఆకలిని సైతం లెఖ్ఖ చెయ్యక ఆ పండును నాకు సమర్పించి గొప్ప త్యాగం చేసింది. ఆమె ఒనరించిన ఈ అపూర్వమైన త్యాగానికి నాకెంతో ప్రీతి కలిగి ఈ ఢమరుకాన్ని మోగించి ఆమె త్యాగనిరతిని ఈ లోకానికి చాటాను. మన వద్ద ఎక్కువగా వున్నవాటిని ఇతరులకు ఇవ్వడం త్యాగం కాదు.మనకు ఎంతో ప్రియమైన దానిని మనము వదులుకోలేని వాటిని ఇతరుల సంక్షేమం కోసం ఇవ్వడమే అసలైన త్యాగం” అని చెప్పారు.

ఆ మాటలకు జ్ఞానోదయమైన ఆ మహారాజు పరిశుద్ధమైన మనసుతో బుద్ధ భగవానుడిని తన అపరాధాన్ని మన్నించమని వేడుకొని ఆయన ఆశీర్వాదాలను తిసుకొని తన పట్టణానికి తిరిగి వెళ్ళాడు.

అసలైన త్యాగానికి నిర్వచనం పై కధ. అసలైన త్యాగానికి నిర్వచనం పై కధ. మనం ప్రతీరోజూ ఏవో చిన్నపాటి దాన ధర్మాలను చేస్తూ వాటికి భగవంతుడు మనలను అనుగ్రహించలేదని ఆయనపై అక్కసు వెళ్లగక్కుకుంటాము. కానీ అసలైన త్యాగం, దానం అంటే ఏమిటో మనం బుద్ధ భగవానుడు ఇచ్చిన దివ్యోపదేశం ద్వారా గ్రహించి తదనుగుణంగా నిత్య జీవితం లో నడుచుకున్నట్లయితే ఆ సర్వేశ్వరుని కృపకు శ్రీఘ్రంగా పాత్రులమగుతాము.

Saturday, January 30, 2010

అసలు తండ్రి

మన్మధరావు, ప్రియంవదలు తమ పదవ పెళ్ళి రోజు వేడుకలను హోటల్ డాల్ఫిన్ లో అట్టహాసంగా జరుపుకుంటున్నారు. బంధు మిత్రులు అందరూ కలిసి ఒక వంద మంది దాకా వచ్చి ఫ్రీ గా వచ్చిన మందు,విందులను భలేగా ఎంజాయ్ చేస్తున్నారు. మధ్య మధ్యలో పదేళ్ళు సక్సెస్ ఫుల్ గా పది సంవత్సరాలు కలిసి జీవించగలిగినందుకు వారిద్దరికీ శుభాకాంక్షలు చెబుతూ వారి విజయ రహస్యం అడిగి తెలుసుకుంటున్నారు.

నాల్గవ రౌండు డ్రింక్స్ తాగడం పూర్తయ్యాక మత్తు నెమ్మదిగా తలకు ఎక్కుతుండగా మన్మధరావు భార్యను పక్కకు పిలిచి ఆమె నాజుకైన చేతులను మెత్తగా నిమురుతూ మంద్ర స్వరంతో “ గత ఆరు నెలలుగా నిన్నొక ప్రశ్న అడుగుదామనుకుంటున్నాను, కాని ధైర్యం చాలక ఇంకా నువ్వు ఎక్కడ ఫీలవుతావోనన్న అనుమానంతో వూరుకున్నాను. ఇప్పుడు అడుగుదామనుకుంటున్నాను, అడగనా? ఏమనుకోవుగా?”అని అన్నాడు.

ఎన్నడూ లేనిది తన మన్మధం ఇలా కొత్తగా ప్రవర్తిస్తున్నాడేమిట్రా అని మనసులో అనుకుంటూ లేని , రాని నవ్వును హి హి హి అని కట్టుడు పళ్ళపైకి తెచ్చి పెట్టుకొని “ ఏం పర్లేదు డియర్ అడుగు” అంతే మత్తుగా అంది ప్రియంవద.అప్పటికింకా జిన్ రెండో రౌండ్ లో మాత్రమే ఆమె వుంది.సాధారణంగా అయిదు రౌండ్లు పూర్తయితే గాని ఆమెకు మత్తెక్కదు.

“ మన చిన్నోడు మిగితా ఇద్దరి కంటే ప్రవర్తనలోనూ, పోలికలలోనూ భిన్నంగా వుండడం గమనించాను. వాడు నన్ను ఒక తండ్రిలాగ చూడడు. నా దగ్గరకు రాడు, ఎత్తుకుంటే ఏడుస్తున్నాడు.మన ఫ్యామిలీ ఫొటో లో వాడు చాలా డిఫెరెంటుగా కనిపిస్తున్నాడు. మనకు పెళ్ళి అయ్యి పదేళ్ళు పూర్తయ్యింది, ఇక మన మధ్య ఏ రహస్యాలు వుండకూడదు, అందుకని ఈ విషయం లో నిజం చెప్పు”

ఊపిరి తీసుకోవడానికి అన్నట్లుగా ఒక్క క్షణం ఆగాడు మన్మధరావు.

“వీడికి తండ్రి వేరు కదూ? “ అని అడిగాడు మన్మధరావు.

భర్త మాటలకు ఆమె మైండులో వెయ్యి జిలిటెన్ స్టిక్స్ ల విస్పోటనం జరిగినట్లు ఫీలయ్యింది. తాను ఎంతో గుట్టుగా జరిపిన తెరచాటు భాగోతం గురించి భర్తకు సమస్తం తెలిసిపోయి వుండవచ్చుననుకుంది. కాని చాకచక్యంతో పరిస్థితి ని ఎదుర్కోవాలనుకొని ప్రియంవద కొంచెం సేపు కావాలనే ఏమీ మాట్లాడలేదు.

“ ఈ పదేళ్ళ మన సహచర్యంలో మనిద్దరి మధ్య బంధం చాలా బలపడింది. మనిద్దరం ఒకరిని విడువకుండా మరొకరం బ్రతికాం. నువ్వేం చెప్పినా నేను తట్టూకోగలను, పైగా నా మనసులో ఏమీ పెట్టుకోను, మన వైవాహిక జీవితం ఇంతకు ముందులాగనే మూడు డిన్నర్లు, ఆరు సినిమాల లాగ సాఫీగా,అద్భుతం గా నడుస్తుంది,కనుక నిజం చెప్పు ప్లీజ్” బ్రతిమిలాడుతున్నట్లు అడిగాడు మన్మధరావు.

గత రెండేళ్ళుగా అతని మనసులో గూడు కట్టూకున్న సంశయాన్ని ఈ పూట ఎట్లాగైనా నివృత్తి చేసుకోవాలనా పట్టుదల అతనిలో స్పష్టంగా కనిపిస్తోంది.

పది నిమిషాలైనా ఆమె నోరు విప్పకపోయేసరికి మన్మధరావులో అసహనం కట్టలు తెంచుకోసాగింది. ఇక లాభం లేదనట్లు ఆమె చేతులను తన తలపై వెసుకొని పాత సినిమాలో గుమ్మడిలా దీనంగా ఫోజు పెట్టి " నిజం చెప్పక పోతే నామీదొట్టే" అన్నాడు.

ఇక ఓవర్ యాక్టింగ్ చేస్తే మంచిది కాదని,మొదటికే మోసం రావచ్చునని అర్ధం చేసుకొని ప్రియంవద నోరు విప్పింది. నేల చూపులు చూస్తూ “ మీరన్నది నిజమే,మొదటి ఇద్దరికీ ,వాడికి తండ్రులు వేరు వేరు. అందుకే వారి ప్రవర్తనలలో తేడా వుంది” అని నెమ్మదిగా ఒక్కొక్క పదం వత్తి పలుకుతూ చెప్పింది.

ఆమె చెప్పిన సమాధానం ఆశించిన విధంగానే వుండడంతో మన్మధరావు పెద్దగా షాక్ కు గురవలేదు. బహుశా మరొకరైతే తెలుగు సినిమాలలో చూపించినట్లు ఎంత ద్రోహం చేసావు ప్రియంవదా, నేను నీకెం ఏమి అన్యాయం చేసానని నాకు ఈ పరీక్ష అంటూ ఆవేశంగా పెద్ద పెద్ద డైలాగులు పలకడం, ఆమె చెంపను చెళ్ళుమనిపించడం చెయ్యలేదు. స్వతాహాగా నెమ్మదస్తుడైనా మన్మధరావు ఒక గాఢమైన నిట్టూర్పు విడిచి” థ్యాంక్స్ ప్రియా, ఈ పూట నా మాట మన్నించి నిజం చెప్పినందుకు నీకు నేను ఎంతో ఋణపడివున్నాను. సరే! అయ్యిందేదో అయిపోయింది,ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. నారు వేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకుండా పంట చేతికి వచ్చాక ఏడిస్తే ఏం లాభం ? గతం గత: అనుకుంటూ యధావిధిగా మన జీవితం కంటిన్యూ చేద్దాం. కానీ ఒక చిన్న రిక్వెస్టు. చంటాడికి తండ్రి ఎవరో కాస్త చెప్పు” అని అన్నాడు.

ఆ మాటలకు మళ్ళీ ప్రియంవద పోయి నేల చూపులు చూడసాగింది. భర్తకు ఈ విషయం చెప్పాలా వద్దా అని మధన పడసాగింది.

మన్మధరావు ఆమెను వదిలి పెట్టలేదు. మళ్ళీ మళ్ళి అడగదమే కాకుండా చెప్పక పోతే ఒట్టు అంటూ మళ్ళి చేతులు తలపై పెట్టుకున్నాడు.

ప్రియంవద ఇక వూరుకోలేక ” మన చంటాడికి తండ్రి మీరే” అని గబ గబ అక్కడి నుండి వెళ్ళిపోయింది.

మొదట ఆమె మాటలు మన మన్మధరావుకు అర్ధం కాలేదు. ఒక పది నిమిషాల తర్వాత అతని బుర్రలో లైటు వెలిగి అసలు విషయం అర్ధం అయ్యేసరికి బుర్రలో పెద్ద విస్పోటనం జరిగి కళ్ళు తిరిగి కింద ఢామ్మని పడిపోయాడు చంటాడికి మాత్రమే తండ్రి అయిన మన్మధరావు.

Saturday, January 9, 2010

అటూ నేనే -- ఇటూ నేనే ( నా పేరే ఊసరవెల్లి)


ఒక రాజకీయ నాయకుడిని ఒక టి వి ప్రతినిధి ఇంటర్వ్యూ చేస్తున్నాడు.

"సార్,తెలంగణాపై మీ వైఖరి ఏమిటి"


రాజకీయనాయకుడు: మా వైఖరి ఇంతకు ముందు రెండు సార్లు స్పష్టం చేసాము. 2004 లో మరియు 2009 లో. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి రెండు సార్లు లేఖ కూడా రాసాము.


విలేఖరి: రెండు సార్లు మీ వైఖరి భిన్నంగా వుంది కదా

రాజకీయనాయకుడు:దానికేముంది, తెలంగణా ప్రజల వైఖరి కూడా భిన్నంగా వుంది కదా.

విలేఖరి:మరి ఇప్పుడు మీ వైఖరి ఏమిటి?

రాజకీయనాయకుడు:అది అడిగే వారు ఏ ప్రాంతం వారన్న దాని బట్టి ఆధారపడి వుంటుంది, ఇంతకూ మీరు ఎక్కడి వారు ?

విలేఖరి: (నా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది పోయి ఈయన గారు తిరిగి నన్నే ప్రశ్నలు వేస్తున్నారేమిట్రా అనుకొని) నేను తెలంగణా కు చెందిన వాడినిసార్.

రాజకీయనాయకుడు:అయితే రాసుకోండి. తెలంగణా ప్రజల మనోభావాలను ప్రభుత్వం గౌరవించాలి. వారి పోరాటం ఈనాటిది కదు, యాభై ఏళ్లనాటిది.వారికి ప్రత్యేక రాష్ట్రం వెంటనే ఇవ్వాలి. అందుకై నేను ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం.జై తెలంగణా

ఇంతలో రాజకియనాయకుడు గారి సెల్లు మోగింది. ఒక పత్రికా విలేఖరి విజయవాడ నుండి ఫోన్ చెసి ఇదే ప్రశ్న అడగగా " రాష్ట్ర ప్రజలందరూ సమైక్యంగా వుండాలన్నదే నా అభిమతం. నేను సమైక్యాంధ్రా వాదిని. సమైక్యాంధ్రా కోసం నేను ఆత్మ త్యాగానికైనా సిద్ధం. సమైక్యాంధ్రా కోసం రేపటి నుండి ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలలో పర్యటన ప్రారంభిస్తున్నాను. అని చెప్పి ఫోన్ కట్ చేసాడు.

విలేఖరి: మరి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగణా లో మీ పర్యటన ఎప్పుడు సార్.

రాజకీయనాయకుడు: సీమాంధ్ర పర్యటన పూర్తవగానే తెలంగణా పర్యటన ప్రారంభమవుతుంది. అమరణ దీక్ష కూడా ప్రారంభిస్తున్నాను.

విలేఖరి: ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ దేశం నలుమూలల నుండి డిమాండ్స్ వెల్లువగా వస్తున్నాయి కదా మరి మీ అభిప్రాయం ఏమిటి ?

రాజకీయనాయకుడు : ఆయా రాష్ట్రాలలో ఏ ప్రభుత్వాలు వున్నాయనే దాని పై మా అభిప్రాయం ఆధారపడి వుంటుంది.ఇప్పుడు మూడు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగబోతున్నాయి కదా ఒకవేళ ప్రభుత్వాలు మారిపోతే వెంటనే మా వైఖరి కూడా మారిపోతుంది.

విలేఖరి: మీ వైఖరి చాలా విచిత్రంగా వుంది సార్?

రాజకీయనాయకుడు: విచిత్రం కాదూ పాడు కాదు. రెండు ప్రదేశాలలో నా పార్టీని కాపాడుకోవాలి కదా అందుకే ఈ జోడు గుర్రాల స్వారి.అప్పటికప్పుడు అందరికీ సర్ధి చెప్పదానికి వెయ్యి అబద్ధాలైనా ఆడక తప్పదు. అయినా మీ పిచ్చి గాని గంటకొక మాట మార్చే మా వంటి రాజకీయ నాయకులకు వైఖరి స్పష్టం చేయమనడం ఏమిటయ్యా? మేమెప్పుడైనా అన్న మాట మీద నిలబడ్డామా ఇప్పటి వరకు? మేము చెప్పిందే వేదం.మేము ఏమంటే అదే రాజ్యాంగం.ప్రజల నుండి రియాక్షన్ రాగానే మళ్ళీ మిమ్మల్ని పిలిచి మేమలా అనలేదని దిద్దుబాటు ప్రకటన ఇచ్చేస్తాం. ఇక్కడితో ఈ ఇంటర్వ్యూ సమాప్తం

ఇదంతా విన్న ఆ విలేఖరి కళ్ళు తిరిగి ఢామ్మని కింద పడిపోయాడు.

(కేవలం మనసారా నవ్వుకోవడానికి మాత్రమే ఈ కధ ఉద్దేశించినది. ఎవ్వరినీ నొప్పించడం నా అభిమతం కాదు.)

Wednesday, January 6, 2010

ఆత్మ విశ్వాసమే శ్రీరామ రక్ష

పూర్వం మగధ దేశం లో నివసించే రామశర్మ అనే బ్రాహ్మణుడు వర్తకం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆతనికి భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. భార్యా చాలా అనుకూలవతి, సత్వ గుణ సంపన్నురాలు. ఫిల్లలను, భర్తనూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ వుండేది. కోరికలను అదుపులూ వుంచుకుంటూ సంతృప్తి తో జీవి స్తుండడం వలన ఆందొళనలు, అశాంతి వారికి ఆమడ దూరం లో వుండేవి.అత్యాశకు పోకుండా కొద్దిపాటి లాభలతో వర్తకం చేస్తుండడం వలన రామ శర్మ యొక్క వ్యాపారం సాఫీగా సాగిపోతూ వుండేది. పైగా కల్తీ లేని సరుకులను తక్కువ ధరకు అమ్ముతాడన్న మంచి పేరు కూడా వచ్చింది.

రోజులన్నీ ఒకేలా వుంటే దానిని జీవితం అని ఎందుకు అంటారు? రామ శర్మ భార్యకు అనారోగ్యం వచ్చింది. దూర దేశం లో వైద్యం చేయించడం మొదలుపెట్టాడు. ఇద్దరు పిల్లలకు పెళ్ళిళ్ళి కూడా చేసేసాడు. వయో భారం వలన ఇదివరకటిలా వ్యాపారం చెయ్యలేకపోతున్నాడు. ఆదాయం మందగించింది, ఖర్చులు ఎక్కువయ్యాయి. పిల్లలు వాపారం నిమిత్తం దూర దేశాలకు వలస వెళ్ళిపోయి తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేసారు.జీవితం లో ఎదురైన ఈ కష్టాల పరంపరను తట్టుకోలేక తల్లడిల్లిపోయాడు.


ఆ సమయంలో వారి గ్రామానికి ఒక సాధు పుంగవుడు వచ్చారు. ఆయన సర్వసంగ పరిత్యాగి. సకల వేద పారంగతుడు. ఊరూరూ తిరిగుతూ అధ్యాత్మిక గోష్టి గావిస్తూ ప్రజలను సన్మార్గంలో నడిపించ యత్నించేవారు.ఆయన వద్దకు వళ్ళి పాదాలపై పడి తన కష్టాలను విన్నవించుకున్నాడు రామశర్మ.

ఆతని మాటలను విన్న ఆ సాధు పుంగవుడు చిరునవ్వుతో” నాయనా ! కష్టాలు, సుఖాల పరంపర ప్రతీ వారి జీవితం లో తప్పనిసరి. వాటిని ధైర్యం తో, ఆత్మ విశ్వాసం తో ఎదుర్కోవలే గాని పిరికితనంతో వాటి నుండి పారిపోకూడదు. పిరికి వానికి ఇహ పరములు రెండూ చెడుతాయి. ధర్మానికి మారుపేరైన శ్రీ రామ చంద్రునికి, మహలక్ష్మీ అవతారమైన సీతమ్మ తల్లికీ కష్టాలు తప్పలేదు కాదా! రాజ్య భోగాలు దూరమై పన్నెండేళ్ళూ వనవాసం చేసి పడరాని కష్టాలు పడ్డారు. సాక్షాత్తు శ్రీ కృష్ణుడు తోడున్నా పాండవులు ఎంతటి కష్టాలు పడ్డారో మనందరికి తెలుసు కదా! వారి కష్టాలతో పోలిస్తే నీకు వచ్చినవి ఎంతటివో ఒక్కసారి ఆలోచించు. జీవితాంతం సుఖాలు మాత్రమే వుండాలి కష్టాల నీలి నీడ మనపై పడకూడదని భావించడం అవివేకం. చేదు తిన్న తర్వాతే తీపి యొక్క తీయనత్వం అనుభవమగు అన్న రీతిన కష్టాలను చవి చూసినప్పుడే సౌఖాల లోని మాధుర్యం మనకు అర్ధమౌతుంది. ఆన్ని ద్వందాలనూ సమంగా స్వీకరించే ఓర్పు,నేర్పు మనం అలవరచుకోవాలి.

కష్టాలనేవి గురువు వంటివి. మనకు జీవిత సత్యాలను బోధించదానికి, ఓర్పు, సహనం, విశ్వాసం వంటి సద్గుణాలను నేర్పడానికే వస్తాయి. వాటిని చిరునవ్వుతో ఎదుర్కొని అధిగమించాలే కాని బెంబేలెత్తి పారిపోకూడదు” అని ఉద్భోదించారు.

అమృతతుల్యమైన ఆ మాటలకు రామశర్మకు జ్ఞానోదయం అయ్యింది.జారిపోయిన ఆత్మ విశ్వాసాన్ని మళ్ళీ నింపుకున్నాడు. ధైర్యంతో ముందుకు సాగి మళ్ళీ జీవితం లో ఉన్నత స్థాయిని సాధించాడు.

చీకటి వెలుగులు, అమావాశ్య పౌర్ణమి , రాత్రి పగలు వలె ద్వందాలు. ప్రతీవారి జీవితం లో ఈ చక్రభ్రమణం తప్పని సరి.కష్టాలు వచ్చినప్పుడు పరిస్థితులను, ఇతరులను నిందించకుండా భగవంతునిపై భారం వేసి ఆత్మ విశ్వాసంతో ఆ పరిస్థితి నుండి బయట పదే మార్గం ఆలోచించాలి.

సుఖాలలో మునిగి తేలుతున్నప్పుడు భగవంతుని విస్మరించరాదు. సదా భగవన్నామస్మరణ చేయడం, సత్కర్మలు ఆచరించడం, కరుణ, జాలి, క్షమలతో పరులను ప్రేమించడం, ఇతరులకు వీలైనంతగా సహాయం చేయడం, అన్నార్తులను ఆదుకోవడం వంటి సత్కార్యాలను చేస్తే భగవంతుడు సంతోషించి మానవులను భవిష్యత్తులో కష్టాల కడలిలో మునిగిపోకుండా కాపాడుతాడు. కామ, క్రోధాది అరిష్డ్వర్గములను లోబర్చుకొని సత్వ గుణ సంపన్నులమై శాంతియుత జీవనం సాగించుట అత్యావశ్యకం. ఇతరులను తమతో పోల్చుకొని తాము దురధృష్టవంతులమన్న నైరాశ్యాన్ని సత్వరం విడనాడాలి. ఈ సృష్టిలో జరిగే ప్రతీ సంఘటన ఈశ్వరేచ్చ ప్రకారమే జరుగుతుంది. సంపదలు కోల్పోతే తిరిగి సాధించుకోవచ్చు కానీ ఆత్మ విశ్వాసం, ధైర్యం కోల్పొతే మాత్రం తిరిగి సాధించుకోలేము.

Friday, January 1, 2010

కవితా సమాహారం - 21


కర్తవ్యం


సేవ,ప్రేమ, త్యాగాలతో మానవ జన్మకు
సార్ధకత చేసుకొన యత్నించడమే
మానవుల ఏకైక కర్తవ్యం
లేనిచో తిరిగి పశు జన్మ ప్రాప్తం
జీవితమంటే ప్రేమ, వికాసం
సంకుచితం, ద్వేషాలకు లేదు చోటు
ఒకే ఒక్క క్షణం పరిపూర్ణంగా
జీవించాలన్న యోచనతోనే
జీవితం అగును సార్ధకం
ఇది అందరికీ అనుసరణీయం


చిరంజీవులు

యుగముల తరబడి రగులుతూ
పొగలు కక్కడం కంటే
ఒక్క క్షణం గొప్పగా జ్వలించడం మేలు
ఆ సత్యమును గుర్తెరిగి
ఆచరించు మానవులు
బ్రతికే వరకు జీవించెదరు
జీవితం ముగిసినా చిరంజీవులే

జీవనం

బ్రతకడం కంటే
జీవించడమే అత్యుత్తమం
స్పష్టమైన లక్ష్యములు లేక
బ్రతుకు బండి లాగించ యత్నించేవారు
లోకంలో ఒంటరులు
వారికి బ్రతుకు సంకుచితం
జీవనం కడు భారం
జీవితంలో మాధుర్యం
జీవనంలో రుచి ఆస్వాదించ
యత్నించువారు సమూహంలో
మమేకమై జీవనం సార్వజనీనం

వాగ్యజ్ఞం

వివేకులు ధనమును
దుర్వినియోగం చేయని రీతిన
వాక్కు దురుపయోగం తగదు
ప్రతీ అక్షరం ఒక పుష్పం వలె
భగవంతుని పాదాలను అర్చించవలెను
పవిత్ర పూజా ద్రవ్యం వలె
వాక్కును పవిత్రీకరించుకోవలెను
వాగ్యజ్ఞం మన కర్తవ్యం
జిహ్వ సార్ధక్యాన్ని సాధించుట
పలికిన ప్రతీ మాట
శుభ శబ్దం, శుభంకరం
కావాలన్నదే మన ప్రతిజ్ఞ

హాస్య వల్లరి-6

1.“కవిని పెళ్ళి చేసుకోవడం తప్పయిపోయిందే !” ఏడుస్తూ అంది రాధ.

“ ఏమయ్యింది ? ఆస్తి, అంతస్తులు, మంచి ఉద్యోగం వున్నాయని అతనిని కావాలనే పెళ్ళి చేసుకున్నావు గా!” ఆశ్చర్యంగా అడిగింది రేఖ.

“ప్రతి రోజూ రాత్రి తాను రాసిన ఆ దిక్కుమాలిన కవితలను వినిపిస్తూ నిద్ర లేకుండా చేస్తున్నాడు ఆ హింసరాజు ” అసలు సంగతి చెప్పింది కవి బాధితురాలైన రాధ.


2.“మీ అమ్మాయిని చూసి మొదట్లో వద్దనుకొని అంతలోనే వెంటనే ఎలా ఒప్పేసుకున్నారు పెళ్ళివారు ? “ ఆశ్చర్యంగా అడిగాడు నరసింహారావు.

“ కట్నం కింద రెండు బస్తాల కంది పప్పు అదనంగా ఇస్తానని కబురు పెట్టాను, ఎగిరి గంతేసి ఒప్పేసుకున్నారు” అసలు సంగతి చెప్పాడు పరమేశం.

3. "ఎందుకే అయ్యగారికి జ్వరం వస్తే అంతగా బెంబేలు పడిపోతున్నావు ?” ఆశ్చర్యంగా అడిగింది ఆండాళ్ళు.

“ ఆయన మీకెంతో నాకూ అంతే కదమ్మా, అందుకే ఈ బెంగ” అసలు సంగతి చెప్పి నాలిక్కరుచుకుంది పనిమనిషి.

4. టెస్టులన్నీ చేసాక ఈ రాత్రి కంటే ఎక్కువ బ్రతకవని సుబ్బారావుకు డాక్టరు చెప్పేసాడు. విచారంగా ఇంటికి వచ్చి ఆదమరిచి నిద్రపోతున్న భార్య అనసూయను నిద్ర లేపి” ఏమేవ్! నేను ఈ రాత్రి కంటే ఎక్కువ బ్రతకనట. కనీసం ఈ రాత్రికి కబుర్లు చెప్పుకుందామే !. నా ఈ ఆఖరు కోరిక తీర్చవే” అని ప్రాధేయపడ్డాడు సుబ్బారావు.

“ ష్! ఊరుకొండి, వెధవ సంత.నేను ఉదయమే నిద్ర లేచి మహిళా మండలి మీటింగ్ కు వెళ్ళాలి. మీరైతే లేవనఖ్ఖరలేదు కదా!” అని పెద్దగా ఆవులించి తిరిగి దుప్పట్లోకి దూరింది అనసూయ.

5. ” డాక్టర్, పిప్పి పన్ను బాగా నొప్పి చేసి, ఎన్ని మందులు వేసుకున్నా తగ్గడం లేదు. చాలా బిజీగా వుండడం వలన మీ దగ్గరకు రాలేకపోయాము. ఈ రోజు కూడా ఇంకొక అప్పాయింట్ మెంట్ వుంది. ఇంజెక్షను వగైరా అక్కరలేకుండానే త్వరగా పన్ను కాస్త పీకెయ్యండి” అఘిగాడు విశ్వేశ్వర రావు.

“అబ్బో, మీకు ధైర్యం చాలా ఎక్కువనుకుంటాను. ఏ పన్నో చూపించండి, ఒక్క నిమిషం లో లాగేస్తాను” పరికరాన్ని చేతిలోకి తీసుకొని అడిగాడు పన్నుల డాక్టర్.

“రజని, డాక్టర్ గారికి ఆ పిప్పి పన్ను కాస్త చూపించు” అని భార్యతో అని గది బయటకు జారుకున్నాడు విశ్వేశ్వర రావు.

6. ”ఏమండీ అల్లుడు గారికి ఆ పని చేత కాదుట. అమ్మాయి డార్జిలింగ్ నుండి ఫోన్ చేసింది. అటువంటి వ్యక్తితో జీవితాంతం కాపురం చెయ్యలేనని, విడాకులు వెంటనే కావాలని అంటోంది” ఏడుస్తూ చెప్పింది అనసూయ.

“ ఇంతకీ ఆల్లుడు గారికి ఏ పని చేత కాదుట?” గాభరాగా అడిగాడు సుబ్బారావు.

“వంట చెయ్యడం” తాపీగా చెప్పింది అనసూయ.

7. అలసత్వానికి మారుపేరైన సుబ్బారావుకు తీవ్రం గా జబ్బు చేసింది. చాలా కాలం తర్వాత డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూపించుకున్నాడు. డాక్టర్ రాసి ఇచ్చిన టెస్టులను బద్ధకించి ఇంకొక రెండు నెలల తర్వాత చేయించుకొని ,ఇంకొక నెల తర్వాత వాటిని చూపించుకోవడానికి డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు.

రిపోర్టులను చూసిన తర్వాత డాక్తర్” సుబ్బారావు గారు, మీకొక బాడ్ న్యూస్.మీరు ఎక్కువ కాలం బతకరు” అని అన్నాడు.

ఆ మాటలు విన్న సుబ్బారావుకు తల దిమ్మెక్కిపోయింది. “ఏమిటి డాక్టర్ గారు మీరు చెప్పేది ? ఇంకా ఎంత కాలం నేను బతుకుతాను ?” అని అడుగగా ఆ డక్తర్ “పది” అని చెప్పాడు.

“ఏమిటి పది డాక్టర్ ? సంవత్సరాలా?నెలలా?వారాలా?సరిగ్గా చెప్పండి? గద్దించాడు సుబ్బారావు.

“తొమ్మిది, ఎనిమిది,ఏదు” లెఖ పెట్టడం ప్రారంభించాడు డాక్టర్.

8. ఒక పిచ్చాసుపత్రి క్లీనిక్ ముందు నుండి వెళ్తుండగా “పదమూడు, పదమూడు “ అంటూ పెద్దగా కేకలు వినబడ్దాయి రామారావుకు.

ఆతృత ఎక్కువై ఏమిటో కనుకుందామని ఆసుపత్రి ఆవరణ లోనికి వెళ్ళాడు. మెయిన్ డొరు వేసి వుంది. దానికి వున్న కన్నం నుండి లోనికి చూడ్డానికి ప్రయత్నించాడు. ఇంతలో అతని కళ్ళు బైర్లు కమ్మాయి. లోపల్నుంచి ఎవరో పుల్లతో అతని కళ్ళలో గట్టిగా పొడిచారు. “అమ్మా" అని బాధతో గట్టిగా అరిచి కన్నుని మూసుకోగా “పధ్నాలుగు, పధ్నాలుగు " అని మళ్ళీ కేకలు మొదలయ్యాయి.

నీతి : తనకు మాలిన ధర్మం వలదు.

Saturday, December 19, 2009

భగవద్దర్శనం

పూర్వం మందగిరి అరణ్య ప్రాంతం లో ఒక గురు కులం వుండేది. అక్కడికి దేశం నలుమూలలా నుండి ఎందరో విధ్యార్ధులు విద్యాభ్యాసం కోసం వస్తుండేవారు. ఆ గురుకులానికి అధిపతి చిదానంద మహర్షుల వారు. చిదానంద మహర్షి సకల వేద పారంగతుడు. సకల శాస్త్రాలను, పనిషత్తులను,పురాణేతిహాసాలను ఔపాసన పట్టిన దిట్ట. తన తప:శ్సక్తితో తన గురుకులానికి వచ్చే ఎందరికో ఎన్నో వ్యాధులను నయం చేసేవారు. తన శిష్యులను తన కంటే ఉత్తములుగా తీర్చి దిద్దాలని సదా తాపత్రయపడుతుండేవారు.

ఆ గురుకులంలో రామశాస్త్రి అనే బ్రాహ్మణ బాలుడు విద్యాభ్యాసం చేస్తుండేవాడు. రామశాస్త్రి స్వతాహాగా చాలా తెలివైన వాడు. ఏక సంధాగ్రహి. గురువు చెప్పిన అతి క్లిష్టమైన పాఠాలను ఠక్కున అర్ధం చేసుకొని గుర్తుంచుకొనడమే కాదు, అడిగినప్పుడల్లా వెంటనే తిరిగి అప్పజెప్పేవాడు. తాను నేర్చుకున్న పాఠాలలో సందేహాలు కలిగితే ఏ మాత్రం సంశయం లేకుండా గురువు గారి దగ్గరకు వెళ్ళి సందేహ నివృత్తి చేసుకునేవాడు. రామశాస్త్రి యొక్క బహుముఖ ప్రజ్ఞ కు,తెలివితేటలకు సాటి విద్యార్ధులే కాక చిదానంద మహర్షి సైతం ఆశ్చర్యపోతుండేవారు.

ఒక సారి రామశాస్త్రి మహర్షుల వారు చెప్పిన భగవంతుని సర్వ వ్యాపక తత్వం అనే పాఠాన్ని తిరిగి వల్లె వేస్తుండగా భగవంతుడు ఎలా వుంటాడు అనే సందేహం కలిగింది. వెంటనే ధ్యానం చేసుకుంటున్న మహర్షుల పాదాలకు నమస్కరించి తన సందేహాన్ని తెలియజేసాడు. "గురుదేవా ! మీరు భగవంతుడు ఈ సకల చరా చర సృష్టిలో చివరకు జడమైన పధార్ధాలలో కూడా అంతటా వ్యాపించి వుంటాడని తెలియజేసారు. అసలు ఆ పరమాత్ముని స్వరూపమేమిటి ? ఏ రూపంలో ఈ విశ్వమంతటా వ్యాపించి వున్నాడు ? ఆ భగవంతుని దర్శనం చేసుకోవాలని నాకు గాఢం గా వుంది"

శిష్యునికి వచ్చిన సందేహం విని మహర్షుల వారు ఎంతో సంతోషించి భగవంతుని సర్వ వ్యాపకత్వం గూర్చి మరింత విపులంగా తెలియజెసి , ఆఖరులో " ఆ భగవంతుని దర్శించాలన్న నీ కోరిక చాలా పవిత్రమైనది మరియు ఉన్నతమైనది.అయితే కేవలం కోరిక వుంటే సరిపోదు. ఆ సర్వేశ్వరుడిని దర్శించాలన్న ఆకాంక్ష తీవ్రం గా వుండాలి.అప్పుడే భవద్దర్శనం ప్రాప్తమౌతుంది" అని ఉద్భోదించారు.

"నాకు ఆ దేవుడిని దర్శించాలన్న కోరిక చాలా ఎక్కువగా వుంది గురుదేవా ! మీ తప:శ్శక్తితో ఎట్లాగైనా నాకు ఆ ప్రాప్తం కలుగజేయండి" అని ప్రార్ధించాడు రామశాస్త్రి.

శిష్యుని మాటలు విని చిన్నగా మందహాసం చెసి "తప్పకుండా నాయనా ! సమయం వచ్చినప్పుడు తప్పకుండా దర్శనం చేయిస్తాను" అని అన్నారు మహర్షుల వారు.

ఆ సమాధానంతో అప్పటికి సంతృప్తి చెందినా ప్రతీ రోజూ భగవంతుడు ఎలా వుంటాడా అని ఆలోచించసాగాడు రామశాస్త్రి. భగవంతుడు ఏ రూపంలో వుంటే ఈ విశ్వమంతటా వ్యాపించి వుండగలడు? ఆ రూపాన్ని ఒక్కసారి దర్శిస్తే గాని తన సంశయం తీరదని ధృఢంగా నిశ్చయించుకున్నాడు.అదే విషయాన్ని మహర్షుల వారిని పదే పదే అడగసాగాడు.

ఒకరోజు చిదానంద మహర్షుల వారు రామశాస్త్రిని తనతో పాటు సముద్ర స్నానానికి రమ్మన్నారు.అలాగేనని గురువుతో పాటు వెళ్ళాడు రామశాస్త్రి. ఇద్దరూ నడుమ లోతు నీటిలోకి దిగి స్నానం చెయ్యసాగారు. ఇంతలో మహర్షుల వారు రామశాస్త్రి పిలక పట్టుకొని హఠాత్తుగా నీళ్ళలోనికి ముంచేసారు.ఈ హఠాత్పరిణామానికి ఆశ్చర్యపోయిన రామసాస్త్రి భయాందోళనలతో "గురుదేవా ! నన్ను రక్షించండి. నేను చచ్చిపోతున్నాను,నాకు ఊపిరి ఆడడం లేదు" అంటూ బిగ్గరగా ఆర్తనాదం చేయసాగాడు.అంతే కాక ఒడ్డున పడిన చేపపిల్లలా కాళ్ళు,చేతులు గట్టిగా కొట్టుకోసాగాడు.గురువు గారు పట్టిన పట్టును విడువకపోయేసరికి ఇక తనకు ఈ భూమ్మీద నూకలు చెల్లినట్లేనని, తన అహంకారానికి గురువు గారి ఈ విధంగా శిక్షిస్తున్నారని నిర్ణయించుకున్నాడు రామ శాస్త్రి.

సరిగ్గా అప్పుడే శిష్యుని పిలక పట్టుకొని నీళ్ళ నుండి పైకి లాగారు మహర్షుల వారు. ఆ చర్యతో ఒకింత ఉపశమనం పొందాడు రామశాస్త్రి.

'నీళ్ళలో వుండేటప్పుడు నీకేమనిపించింది? దేని కోసం పరితపించావు? "ప్రశ్నించారు చిదానంద మహర్షి.
"గురుదేవా! నీళ్ళలో మునిగిపోయినప్పుడు ఊపిరి అందలేదు.మరణం తధ్యమని భావించాను.కాస్తంత ఊపిరి లభిస్తే చాలని భావించాను" వినయంగ చెప్పాడు రామశాస్త్రి.

"నువ్వు ఇంతకాలంగా అడుగుతున్న ప్రశ్నకు ఇదే సమాధానం"చెప్పారు చిదానంద మహర్షి. "నీటిలో మునిగిపోయినప్పుడు ఊపిరి కోసం,ప్రాణానికి రక్షణ కోసం ఎలా పరితపించావో అంతే ఆర్తితో భగవంతుని కోసం పరితపించినప్పుడు ఆ సర్వేశ్వేరుడు తప్పక తన దర్శన భాగ్యం కలుగజేస్తాడు.భగవద్దర్శనం కోసం కావల్సినంత కేవలం ప్రేమ, భక్తి మరియు తీవ్రమైన ఆకాంక్ష,ఐహికపరమైన కోరికలతో అనుక్షణం కొట్టుమిట్టాడే వారికి భగవద్దర్శనం అసాధ్యం. ఆ విధంగా కృషి చేసి నీ లక్ష్యాన్ని సాధించుకో."

గురుదేవుల మాటలకు రామశాస్త్రి ఎంతో సంతోషించి కళ్ళ నీళ్ళ పర్యంతమై పాదాభివందనం చేసాడు.

ఆత్మ విశ్వాసమే శ్రీరామ రక్ష

పూర్వం మగధ దేశం లో నివసించే రామశర్మ అనే బ్రాహ్మణుడు వర్తకం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆతనికి భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. భార్యా చాలా అనుకూలవతి, సత్వ గుణ సంపన్నురాలు. ఫిల్లలను, భర్తనూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ వుండేది. కోరికలను అదుపులూ వుంచుకుంటూ సంతృప్తి తో జీవి స్తుండడం వలన ఆందొళనలు, అశాంతి వారికి ఆమడ దూరం లో వుండేవి.అత్యాశకు పోకుండా కొద్దిపాటి లాభలతో వర్తకం చేస్తుండడం వలన రామ శర్మ యొక్క వ్యాపారం సాఫీగా సాగిపోతూ వుండేది. పైగా కల్తీ లేని సరుకులను తక్కువ ధరకు అమ్ముతాడన్న మంచి పేరు కూడా వచ్చింది.

రోజులన్నీ ఒకేలా వుంటే దానిని జీవితం అని ఎందుకు అంటారు? రామ శర్మ భార్యకు అనారోగ్యం వచ్చింది. దూర దేశం లో వైద్యం చేయించడం మొదలుపెట్టాడు. ఇద్దరు పిల్లలకు పెళ్ళిళ్ళి కూడా చేసేసాడు. వయో భారం వలన ఇదివరకటిలా వ్యాపారం చెయ్యలేకపోతున్నాడు. ఆదాయం మందగించింది, ఖర్చులు ఎక్కువయ్యాయి. పిల్లలు వాపారం నిమిత్తం దూర దేశాలకు వలస వెళ్ళిపోయి తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేసారు.జీవితం లో ఎదురైన ఈ కష్టాల పరంపరను తట్టుకోలేక తల్లడిల్లిపోయాడు.

ఆ సమయంలో వారి గ్రామానికి ఒక సాధు పుంగవుడు వచ్చారు. ఆయన సర్వసంగ పరిత్యాగి. సకల వేద పారంగతుడు. ఊరూరూ తిరిగుతూ అధ్యాత్మిక గోష్టి గావిస్తూ ప్రజలను సన్మార్గంలో నడిపించ యత్నించేవారు.ఆయన వద్దకు వళ్ళి పాదాలపై పడి తన కష్టాలను విన్నవించుకున్నాడు రామశర్మ.

ఆతని మాటలను విన్న ఆ సాధు పుంగవుడు చిరునవ్వుతో” నాయనా ! కష్టాలు, సుఖాల పరంపర ప్రతీ వారి జీవితం లో తప్పనిసరి. వాటిని ధైర్యం తో, ఆత్మ విశ్వాసం తో ఎదుర్కోవలే గాని పిరికితనంతో వాటి నుండి పారిపోకూడదు. పిరికి వానికి ఇహ పరములు రెండూ చెడుతాయి. ధర్మానికి మారుపేరైన శ్రీ రామ చంద్రునికి, మహలక్ష్మీ అవతారమైన సీతమ్మ తల్లికీ కష్టాలు తప్పలేదు కాదా! రాజ్య భోగాలు దూరమై పన్నెండేళ్ళూ వనవాసం చేసి పడరాని కష్టాలు పడ్డారు. సాక్షాత్తు శ్రీ కృష్ణుడు తోడున్నా పాండవులు ఎంతటి కష్టాలు పడ్డారో మనందరికి తెలుసు కదా! వారి కష్టాలతో పోలిస్తే నీకు వచ్చినవి ఎంతటివో ఒక్కసారి ఆలోచించు. జీవితాంతం సుఖాలు మాత్రమే వుండాలి కష్టాల నీలి నీడ మనపై పడకూడదని భావించడం అవివేకం. చేదు తిన్న తర్వాతే తీపి యొక్క తీయనత్వం అనుభవమగు అన్న రీతిన కష్టాలను చవి చూసినప్పుడే సౌఖాల లోని మాధుర్యం మనకు అర్ధమౌతుంది. ఆన్ని ద్వందాలనూ సమంగా స్వీకరించే ఓర్పు,నేర్పు మనం అలవరచుకోవాలి.

కష్టాలనేవి గురువు వంటివి. మనకు జీవిత సత్యాలను బోధించదానికి, ఓర్పు, సహనం, విశ్వాసం వంటి సద్గుణాలను నేర్పడానికే వస్తాయి. వాటిని చిరునవ్వుతో ఎదుర్కొని అధిగమించాలే కాని బెంబేలెత్తి పారిపోకూడదు” అని ఉద్భోదించారు.

అమృతతుల్యమైన ఆ మాటలకు రామశర్మకు జ్ఞానోదయం అయ్యింది.జారిపోయిన ఆత్మ విశ్వాసాన్ని మళ్ళీ నింపుకున్నాడు. ధైర్యంతో ముందుకు సాగి మళ్ళీ జీవితం లో ఉన్నత స్థాయిని సాధించాడు.

చీకటి వెలుగులు, అమావాశ్య పౌర్ణమి , రాత్రి పగలు వలె ద్వందాలు. ప్రతీవారి జీవితం లో ఈ చక్రభ్రమణం తప్పని సరి.కష్టాలు వచ్చినప్పుడు పరిస్థితులను, ఇతరులను నిందించకుండా భగవంతునిపై భారం వేసి ఆత్మ విశ్వాసంతో ఆ పరిస్థితి నుండి బయట పదే మార్గం ఆలోచించాలి.

సుఖాలలో మునిగి తేలుతున్నప్పుడు భగవంతుని విస్మరించరాదు. సదా భగవన్నామస్మరణ చేయడం, సత్కర్మలు ఆచరించడం, కరుణ, జాలి, క్షమలతో పరులను ప్రేమించడం, ఇతరులకు వీలైనంతగా సహాయం చేయడం, అన్నార్తులను ఆదుకోవడం వంటి సత్కార్యాలను చేస్తే భగవంతుడు సంతోషించి మానవులను భవిష్యత్తులో కష్టాల కడలిలో మునిగిపోకుండా కాపాడుతాడు. కామ, క్రోధాది అరిష్డ్వర్గములను లోబర్చుకొని సత్వ గుణ సంపన్నులమై శాంతియుత జీవనం సాగించుట అత్యావశ్యకం. ఇతరులను తమతో పోల్చుకొని తాము దురధృష్టవంతులమన్న నైరాశ్యాన్ని సత్వరం విడనాడాలి. ఈ సృష్టిలో జరిగే ప్రతీ సంఘటన ఈశ్వరేచ్చ ప్రకారమే జరుగుతుంది. సంపదలు కోల్పోతే తిరిగి సాధించుకోవచ్చు కానీ ఆత్మ విశ్వాసం, ధైర్యం కోల్పొతే మాత్రం తిరిగి సాధించుకోలేము.

Friday, December 18, 2009

ధర్మాచరణే శ్రేష్టం

ధర్మార్ధ, కామ,మోక్షములను పురుషార్ధములని మన వేదాలు నిర్వచించాయి. అంటే ఏన్నో వేల జన్మల అనంతరం లభించే ఈ అపురూపమైన మానవ జన్మ ఎత్తిన ప్రతీవారు తప్పక సాధించవలసిన విషయములివి అని అర్ధం. వీటిలో ఏ ఒక్కటి సాధించలెకపోయినా ఎత్తిన ఈ మానవ జన్మకు విలువ వుండదు.ఈ పురుషార్ధముల వరుస క్రమాన్ని పరిశీలిస్తే ధర్మం ప్రధమ స్థానం లో వుంది.దీనిని బట్టి ధర్మాచరణ మరియు ధర్మయుతమైన జీవనాన్ని కొనసాగించవల్సిన ఆవశ్యకతను మన వేదాలు నొక్కి వక్కాణించాయి.

ఐహిక విషయ వాంచలు, భోగ భాగ్యాలే కాక మైధునముల విషయములను కూడా ధర్మయుతంగానే మనం సాధించుకోవాలి , అనుభవించాలి. మనం వేసే ప్రతీ అడుగు, ప్రతి ఆలోచనా కూడా ధర్మానుకూలంగానే వుండాలి.ఇది సృష్టి నియమం. ఎంతటి మహా భక్తుడైనా వీటిని అధర్మయుతంగా సాధించాలని యత్నిస్తే అధోగతి పాలు కాక తప్పదు. ఇందుకు మన పురాణాలలో లెక్కకు మించిన తార్కాణాలు వున్నాయి.

రాక్షసరాజైన హిరణ్య కశిపుడు దేవతలను లొంగదిసుకోవడానికి బ్రహ్మ దేవుని గూర్చి అతి కఠోరమైన తపస్సు చేసాడు. మహర్షులకు సైతం సాధ్యం కాని రీతిన తపస్సు ఒనరించాడని మన పురాణాలు తెలియజెస్తున్నాయి. ఆయన తపస్సుకు సంతోషించి బ్రహ్మదేవుడు ఏదైనా వరం కోరుకోమని అడిగితే అజ్ఞానం, గర్వాహంకారములతో తల్లి కడుపులో నుండి పుట్టక,రాత్రి, పగలు కాక, మనిషి, జంతువు కాక నేలమీద, ఆకాశం లో కాక మరణించకుండునట్లు వరం పొందాడు. ఇది ఎంతటి అధర్మ యుతం ? సృష్టికి విరుద్ధం ? స్వార్ధానికి పరాకాష్ట. వరం పొందాక మరణమును జయించానన్న అహంకారంతో విర్రవీగి ఎన్నో వర్ణింప శక్యం కాని దుర్మార్గాలను చేసాడు.దేవతలను అనేక ఇ క్కట్ల పాలు చేసాడు. ఎందరో పర స్త్రీలను అమానుషంగా అధర్మయుతం గా అనుభవించాడు. ఫలితంగా అతని పాపం పండే నాటికి శ్రీ మహా విష్ణువు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపనార్ధం నారసింహావతారమును ఎత్తి హిరణ్య కశిపుని సంహరించాడు. హిరణ్య కశిపుని ఘోర తపస్సు అధర్మ యుత కోరికలకు , నడవడికకు బలైపోయింది.

పరమ శివ భక్తాగ్రేసరుడైన రావణ బ్రహ్మ తన తల్లి కొరిక తీర్చడం కొరకు కఠోర తపస్సు గావించి శివుని ఆత్మ లింగానే కానుకగా పొందాడు.మహా భక్తుడనన్న అహంకారంతో శివ పార్వతుల నివాసమైన కైలాస పర్వతమును పెకిలించి తన శిరస్సుపై మోసినవాడు. నిత్యం సప్త సముద్రాలను దాటి శివ ఆరాధన గావించి తిరిగి తన లంకాపురికి వచ్చేవరకు పచ్చి గంగైనా ముట్టని రావణ బ్రహ్మ తన అద్భుతమైన, అసామాన్యమైన దీక్ష ద్వారా దేవతల చేత మరణం పొందకుండునట్లు వరం పొందాడు, కేవలం అహంకారం చేతనే మానవ, జంతువులను విస్మరించాడు.

అపూర్వమైన వరములను పొందిన కారణంగా దేవతలపై దండెత్తి వారిని దారుణంగా హింసించాడు. ఎందరో పర స్త్రీలను చెరబట్టాడు, చివరకు శుర్పణఖ ప్రేరేపించిన కారణంగా మహా సాధ్వి, శ్రీ రామ చంద్రుని పట్టమహిషి అయిన సీతమ్మ తల్లినే కపట వంచనతో సాధువు రూపంలో వచ్చి అపహరించాడు. అధర్మయుతంగా ఇతరుల సంపదలను, స్త్రీలను అనుభవించిన కారణంగానే యుద్ధంలో తన వారినందరినీ పోగొట్టుకొని చివరకు శ్రీ రామచంద్రుని చేతిలో దిక్కు లేని చావు చచ్చాడు. ఎంతటి మహా భక్తుడు ? ధర్మ బద్ధం కాని నడవడిక వలన నాశనమైపోయాడు.

కలిపురుషుడి అంశలో జన్మించి అసమాన్య శూరులైన కౌరవులందరికీ అగ్రజుడైన ధుర్యోధనుడి జీవితం ఒకసారి పరిశీలించండి. అతనికి వున్న సిరి సంపదలు, బల పరాక్రమాలు అనిర్వచనీయం. అయితే అధర్మయుత నడవడికే అతని కొంప ముంచింది కౌరవ వంశాన్ని సమూలంగా నాశనం చెసింది. అసమాన్యమైన వైభవం కలిగిన ఆ రారాజు శకుని పన్నిన కుట్రలో పాల్గొని ధర్మానికి మారుపేరైన పాండవుల సిరి సంపదలన్నింటినీ అపహరించి వారిని అడవుల పాలు జేసాడు. మహా పతివ్రత అయిన ద్రౌపది యొక్క వస్త్రములను నిండు సభలో నలుగురి ఎదుట విప్పించి అతి ఘోరంగా అవమానించాడు.కాని చివరకు ధర్మమే జయించింది. అధర్మంగా సంపదలను, కామమును అనుభవించ యత్నించిన ఆ రారాజు తన వారినందరినీ కురుక్షేత్ర యుద్ధం లో కోల్పోయి దిక్కులేని చావు చచ్చాడు. దాన చక్రవర్తిగా చరిత్ర కెక్కిన కర్ణుడు కూడా అధర్మానికి బాసటగా నిలవడం వలనే అతి దారుణంగా చంపబడ్డాడు.

పై ఉదాహరణలను నిశితంగా పరిశీలిస్తే మనకు ఒక విషయం చాలా సుస్పష్టంగా అర్ధమౌతుంది.మిగితా మూడు అర్ధములైన అర్ధ, కామ మోక్షములు ధర్మయుతమైన నడవడిక ద్వారానే సాధించాలి, లేకపోతే వినాశనం తప్పదు.ధర్మం చాలా గొప్పది. ధర్మోతి రక్షితి రక్షిత: అన్నది ఆర్యోక్తి.ధర్మాన్ని ఆచరిస్తే అది మనలను తప్పక కాపాడుతుంది.ఇందులో కించిత్ సందేహం కూడా లేదు.కనుక మనమందరం కూడా ధర్మ మార్గంలోనే నడిచి ధర్మయుతమైన కోరికలను ధర్మ మార్గంలోనే తీర్చుకుందాం. ధర్మ మార్గంలోనే సంసార సుఖమును అనుభవిద్దాం మరియు ధర్మ మార్గంలోనే అర్ధం అంటే భోగ భాగ్యాలను సంపాదించుదాం , వాటిని ఆనందంతో అనుభవించుదాం.అధర్మ మార్గం చాలా వినాశకారి. మొదట్లో సౌఖ్యంగా వున్నా చివరకు వినాశనం తప్పదు. ధర్మ మార్గం తొలుత కష్టంగా వున్నా చివరకు సౌఖ్యాలను ప్రసాదిస్తుంది. మానవులను ముక్తికి అర్హులను చేస్తుంది.ఎన్ని యజ్ఞయ యాగాదులు చేసినా, కఠోర తపస్సులు సల్పినా ధర్మబద్ధమైన జీవనం చేయకపోతే అవన్నీ నిష్ప్రయోజనం.ధర్మమునకే అంతిమ విజయం, యుగ యుగాలుగా నిరూపింపబడిన సత్యం.


సర్వే జనా సుఖినోభవంతు
లోకా స్సమస్తా సుఖినోభవంతు

Wednesday, December 16, 2009

అగ్ని పరీక్ష

పూర్వం మగధ రాజ్యం లో వేద ధర్ముడనే సాధు పుంగవుడు వుండే వాడు.అతడు సకల వేద, శాస్త్ర పారంగతుడు.పురాణేతి ఇతిహాసాలను ఔపాసన పట్టిన దిట్ట. ఊరికి నాలుగు క్రోసుల దూరం లో ఒక నది ఒడ్డున చిన్న ఆశ్రమాన్ని నిర్మించుకొని జీవిస్తుండే వాడు. వేద ధర్ముడు మహా శివ భక్తుడు. వేకువ జామునే లేచి కాల కృత్యాలు తీర్చుకొని, స్వయంగా గోవు పాలు పితికి శివునికి అభిషాకం చెస్తేనే గాని పచ్చి గంగయినా ముట్టేవాడు కాదు. శివ భక్తియే కాక వేద ధర్ముడు గొప్ప మానవతా విలువలు మూర్థీభవించిన నిర్మల హృదయుడు. తన గుమ్మం లోనికి ఎవరొచ్చినా సరే, తనకు మిగిలిందా లెదా అని కూడా చూసుకోకుండా దన ధర్మలను చేస్తుండే వాడు.

ఒకసారి మహాశివుడు వేద ధర్ముని భక్తి, విశ్వాసాలను పరీక్షించ దలిచాడు. వేద ధర్ముని ఆశ్రమ ప్రాంతం లో తీవ్రమైన కరువు కాటకాదులను సృష్టించాడు. ఆ ప్రాంతం లోని ప్రజలు దేశం లోని ఇతర ప్రదేశాలకు వలస వెళ్ళిపోసాగారు. ఆశ్రమానికి వచ్చి కానుకలను సమర్పించే వారి సంఖ్య గననీయం గా తగ్గిపోయింది. సరైన పోషన లెక ఆవు కూడా కొద్ది రోజులకే మరణించింది. ఇన్ని ఇబ్బందులు ఏకకాలం లో ఎదురైనా సరే వేద ధర్ముడు తన శివారాధనను మానలేదు. పాలు లేకపోయినా, స్వచ్చమైన నదీ జలంతో నిత్యం మహాశివునికి అభిషేకం జరుపుతుండే వాడు. నారు పోసిన వాడు నీరు పొయ్యడా అనే చందాన తనను సృష్టించిన ఆ మహా శివుడే తన పోషణ భారం కూడా చూసుకుంటాడన్న ధృఢమైన విశ్వాసంతో వున్నాడు వేద ధర్ముడు.

ఇదిలా వుండగా ఒకసారి ఆశ్రమం లో బియ్యపు గింజలు పూర్తిగా నిండుకున్నాయి. తోటలో ఫలాల చెట్లు కూడా పూర్తిగా ఎందిపోయాయి. కటిక ఉపవాసం చేయవలిసి వచ్చింది.అయినా కేవలం మంచి నీరు త్రాగుతూ, శివ పంచాక్షరీ మంత్రం జపిస్తూ ప్రాణాలను నిలబెట్టుకుంటున్నాడు వేద ధర్ముడు.

నాలుగు రోజులు అలాగే గడిచాయి.తీవ్రమైన నీరసం ఆవహించినా శివ నామ జపం ఆపలేదు వేద ధర్ముడు.ఇంతలో ఒక భక్తుడు వచ్చి కొంచెం బియ్యం సమర్పించి వెళ్ళాడు. "శివార్పణ మస్తు" అని ఆ బియ్యాన్ని పులగంగా వండి శివునికి నైవేద్యం అర్పించాడు వేద ధర్ముడు. అతి పవిత్రమైన ఆ భుక్తాహారామ్మి స్వీకరించే తరుణం లో " తండ్రీ ధర్మం చెయ్యండి" అనే అతి దీనమైన పిలుపు ఆశ్రమ ప్రాంగణం లో వినిపించింది. వెంతనే బయటకు వెళ్ళీ చూస్తే ఒక ముదుసలి చేతిలో కర్రతో వణుకుతూ నిలబడి వున్నాడు. ముఖమంతా మడతలు పడి వుంది. శరీరం వ్యార్ధకంతో నిండి వుంది." స్వామీ ! వారం రోజుల నుండి తిండి లేదు.ఆకలితో చచ్చిపోతున్నాను. తినడానికేమైనా ఇచ్చి కాస్త పుణ్యం కట్టుకో.ఏ క్షణాన్నైన్నా నా ప్రాణం పోయేట్టు వుంది" అని అతి దీనం గా విలపించాడు ఆ ముసలి వ్యక్తి.

వేద ధర్ముని హృదయం ఆ మాటలకు పూర్తిగా ద్రవించింది. తన ఆకలి కంటే ఆ ముసలివాని ఆకలి మరింత తీవ్రమైనది. తాను అదృష్టం చేసుకోబట్టే ఆ ముసలి వాని ఆకలి తీర్చే భాగ్యం తనకు కలిగింది అనుకుంటూ ఆ ముసలిని "అతిధిదేవో భవ" అంటూ సాదరంగా ఆహ్వానించి, కాళ్ళు చేతులు కడిగి ఒక ఆసనంపై కూర్చోబెట్టి తాను వండిన అన్నం మొత్తమును ఆ ముసలి వానికి వడ్డించేసాడు. భోజనానంతరం త్రాగడానికి స్వచ్చమైన నీరు ఇచ్చి "మీరు అలసట తిరే వరకు ఇక్కదే విశ్రమించండి" అని అతనిని తన ఆశ్రమం లోపల పరుండబెట్టాడు.అంతే కాక తానే స్వయంగా అతనికి సపర్యలు చేసాడు. సాయంత్రానికి సేద తీరి తిరిగి శక్తి సంపాదించుకున్న ఆ ముదుసలి తనకు జరిగిన అథిధి సత్కారానికి ఎంతో ఆనందించి వేద ధర్ముని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు.తినడానికి ఏ మాత్రం భోజనం మిగలనందుకు వేద ధర్ముడు కించిత్ కూడా బాధ పడలేదు. పైగా వాకిట్లో నిలచిన అతిధికి తాను చేతనైనంతగా సత్కారం చేయగలిగినందుకు ఎంతో సంతోషించాడు. ప్రాణాలను నిలుపుకునేందుకు శివ పంచాక్షరీ మంత్ర జపమునే సాధనంగా ఎంచుకున్నాడు.

ఆ ముదుసలి రూపం లో వచ్చి తన భక్తుడిని పరీక్షించిన మహా శివుడు తన అగ్ని పరీక్షలో నెగ్గినందుకు వేద ధర్ముడిని ఆశీర్వదించాడు.జీవితపు అంతిమ ఘడియలలో అతనికి శాశ్వత శివ సాయుజ్యం ప్రసాదించాడు. భగవంతుడు పెట్టే వివిధ రకములైన పరీక్షలకు తట్టుకొని , ఆత్మ విశ్వాసం తో సహనం పట్టుదలలతో ఆ భగవంతుని పాదాలను చివరి వరకు విడువని వారే అధ్యాత్మిక జీవితలలో విజయం సాధిస్తారు అనడానికి వేద ధర్ముని జీవితమే ఒక నిదర్శనం.

Saturday, October 17, 2009

హాస్య వల్లరి - 5

1. “ఏవడే ఆ చుంచు మొహం గాడు ? మీసాలు, గెడ్డాలు కూడా లేకుండా కోతిలా వున్నాడు. వాడి వెధవ ముఖానికి సైటు కొట్టడం ఒకటి. చూడు మనల్నే ఎలా చూస్తున్నాడో ? “ ఈసడింపుగా అంది రేఖ.


“ ఓహ్, అతనా ! అతను నాకు అన్నయ్య వరస అవుతాడులే. బెంగుళూరులో సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. నెలకు లక్ష రూపాయలు జీతం.శెలవల కోసం నిన్నే ఈ ఊరొచ్చాడు” అసలు సంగతి చెప్పింది రాధ.


“ ఓహ్ గ్రేట్, ఎంత అందమైన పెర్సనాలిటీనో, షారూఖ్ ఖాన్ కూడా ఇతని ముందు దిగదుడుపే, కంప్లీట్ షేవింగ్ లో ఇంకా సూపెర్బ్ గా వున్నాడు.కాస్త పరిచయం చెయ్యవే బాబూ , నీకు పుణ్యం వుంటుంది” బ్రతిమిలాడసాగింది రేఖ.

2. “ఈ రోజు నుండి కాస్త ప్రశాంతం గా నిద్రపోదామనుకుంటున్నాను, మిమ్మల్ని వెంటనే వచ్చి కలవచ్చునా ?” ఫోన్ లో అడిగాడు రమేష్.


“ అలాగే తప్పకుండా రండి. కానీ నేను డాక్టర్ని కాదు. లాయర్ని” ఆశ్చర్యంగా చెప్పాడు వెంకట్రావు.


“ కరక్టే నండి. నాకు అర్జంటుగా డైవోర్స్ కావాలి” అసలు సంగతి చెప్పి ఫోన్ పెట్టేసాడు రమేష్.

3.” ప్రియా , నీ చెంపలు ఎంతో నున్నగా వున్నాయి,రోజుకు ఎన్ని సార్లు షేవింగ్ చేస్తావు?” మత్తుగా అడిగింది రజని.


“ ఒక ఇరవై సారులు చేస్తాను”


“ నీకేమైనా పిచ్చి గానీ పట్టిందా, రోజుకు ఇరవై సార్లు షేవింగా ?” ఆశ్చర్యంగా అడిగింది రజని.


“ అవును, నేను సెలూన్ లో పని చేస్తాను” అసలు సంగతి చెప్పాడు గణేశ్.

4.”అడ్డమైన బేవార్సు వెధవలతో స్నేహం చేయవద్దని మా నాన్నగారు చెప్పారు” గర్వంగా అన్నాడు రవి.

“ కరక్టే, అందుకే నేను నీతో ఈ రోజు నుండి స్నేహం మానెస్తున్నాను, బై, బై” అంటూ వెళ్ళిపోయాడు శ్రీను.