త్రిమూర్తుల స్వరూపమైన సద్గురువు
సర్వాంతర్యామి అని గ్రహించి
అన్ని రకముల అహంకారములను త్యజించి
సద్గురువులను శరణు పొందిన
మన అజ్ఞానము శ్రీఘ్రమే నశించును
ఇక మరే విధములైన బోధల అవసరము లేదు
సూర్యుని ముందు అంధకారము వుండని రీతిన
సద్గురువు సమక్షంలో మనకు భవసాగరము వుండదు
అన్ని రకములైన బంధాల నుండి విడిపడి
పరాన్ముఖులైన వారే సద్గురువు యొక్క
అనుగ్రహ వర్షంలోతడిసి మద్దగును,
జీవితం అగును సార్ధకం
అనుపమానమైన పరమానందం లభ్యం
నేను నాది అన్న భావం నుండి బయట పడి
అహంభావం లేక కర్మలను ఒనరించడం మన తక్షణ కర్తవ్యం
No comments:
Post a Comment