Saturday, February 23, 2008

రైతన్నలు

దేశానికి వెన్నుముక్క మన రైతన్న
దేశాభివృద్ధిలో రైతన్నకు ఎంతో ప్రాధాన్యం
పల్లెలు ప్రగతి పధామున నడిచేందుకు
రైతన్నల పాత్ర బహు కీలకం
వ్యవసాయ ఆధారిత దేశం లో
తరచు నిర్లక్ష్యానికి గురయ్యె మన రైతన్న
వాతావరణ ప్రతికూలతలు, విద్యుత్ కోతలు
నకిలీ విత్తనాల పంపిణీ, దళారుల అజమాయిషీ
వ్యవసాయ రంగం లో తగ్గిన ప్రభుత్వ పెట్టుబడులు
సకాలం లో అందుబాటుకు రాని పంటలు
రైతన్నలకు లభించని గిట్టుబాటు ధరలు
రైతన్న ల కడగండ్లను పట్టించుకోని ప్రభుత్వాలు
నలుగురికీ అన్నం పెట్టిన అన్నపూర్ణ చెయ్యి
ఇప్పుడు పది మంది ముందు జాపవల్సిన దుస్థితి
రైతన్న ఆనందం గా వుంటేనే పల్లెలు సుభిక్షమౌతాయి
తద్వారా సుస్థిర దేశాభివృద్ధి సాధ్యం

No comments: